IND vs WI: వెంకటేశ్కు సవాలు విసిరాం.. ప్రతిసారీ అతడు మెరుగయ్యాడు: ద్రవిడ్
టీమ్ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను చూసి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ముచ్చటపడుతున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల్లో...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను చూసి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ముచ్చటపడుతున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల్లో ఈ యువ ఆటగాడు మొత్తం 92 పరుగులు చేసి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్ల్లో సూర్యకుమార్తో కలిసి ఫినిషర్గా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విలువైన భాగస్వామ్యాలు నిర్మించి అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో గతరాత్రి టీమ్ఇండియా సిరీస్ కైవసం చేసుకున్నాక మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ అయ్యర్పై ప్రశంసలల వర్షం కురిపించాడు.
‘ఐపీఎల్లో వెంకటేశ్ కోల్కతా జట్టుకు ఓపెనర్గా రాణిస్తున్నాడని తెలుసు. అయితే, టీమ్ఇండియాలో అతడు ఎలాంటి పాత్రలో సరిగ్గా సెట్ అవుతాడనే విషయంలో మేం చాలా స్పష్టతతో ఉన్నాం. కచ్చితంగా టాప్ త్రీలో ఉండలేడు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానాల్లో కీలక ఆటగాళ్లు బాగా ఆడుతూ కొనసాగుతున్నారు. అందువల్లే అతడిని మిడిల్ ఆర్డర్లో పంపుతున్నాం. కావాలనే ఆ సవాలు విసిరాం. దీంతో బరిలోకి దిగిన ప్రతిసారీ ఆకట్టుకున్నాడు. ఎంతో మెరుగవుతున్నాడు. ఇది సంతోషించే విషయం’ అని ద్రవిడ్ మెచ్చుకున్నాడు.
అనంతరం వెంకటేశ్ బౌలింగ్పై స్పందిస్తూ.. ‘జట్టుకు అవసరమైనప్పుడు కెప్టెన్ ఆరో బౌలర్ను ఉపయోగించుకుంటాడు. అలాంటి సమయంలోనూ ఈ యువ ఆటగాడు ఆకట్టుకున్నాడు. ఆరో బౌలర్ అంటేనే కీలక సమయాల్లో బౌలింగ్ చేయడానికి ఉంటాడు. ఈ మ్యాచ్లో దీపక్ చాహర్కు గాయమైనప్పుడు వెంకటేశ్ 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు బౌలింగ్లోనూ జట్టుకు ఉపయోగపడ్డాడు. అతడికి ఈ సిరీస్ అద్భుతంగా నిలుస్తుంది’ అని టీమ్ఇండియా కోచ్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!