IND vs WI: మాకు కావాల్సిన దాన్ని ఈ సిరీస్తో సొంతం చేసుకున్నాం: రోహిత్
తమకు కావాల్సిన దాన్ని ఈ సిరీస్తో సొంతం చేసుకున్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతరాత్రి వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20లో భారత్ 17 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే...
కోల్కతా: తమకు కావాల్సిన దాన్ని ఈ సిరీస్తో సొంతం చేసుకున్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20లో భారత్ 17 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 3-0 తేడాతో టీమ్ఇండియా పొట్టి సిరీస్నూ వైట్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ తమకు కావాల్సింది దక్కిందన్నాడు.
‘మా జట్టు ఛేదన కూడా చేయగలదు. అయితే, ఈ మ్యాచ్లో పలువురు కీలక ఆటగాళ్లు మిస్సయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి ఎదురైతే ఎలా ఆడాలనేది ముందే చర్చించుకున్నాం. ఈ క్రమంలోనే మా యువకులు క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును కాపాడారు. ఇది చాలా ముచ్చటగొలిపే విషయం. మా టీమ్ ఇలా విజయాలు సాధించడం గర్వంగా ఉండటంతో పాటు జట్టుకు కూడా శుభపరిణామం. ముఖ్యమైన విషయం ఏమిటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించడం. వన్డేలతో పాటు ఇక్కడా రాణించారు. ఇక బౌలింగ్లో హర్షల్ పటేల్ సత్తా చాటడం బాగుంది. ఈ మ్యాచ్లో అవేశ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. శార్ధూల్ జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు. దీంతో వాళ్లకు అవకాశం ఇచ్చి చూడటం సవాలుతో కూడుకున్నది. ఇక ఈ చివరి రెండు మ్యాచ్ల్లోనూ లక్ష్యాన్ని కాపాడుకోవడం మంచి ఛాలెంజింగ్గా అనిపించింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
‘ఇక శ్రీలంక సిరీస్ కోసం ఇద్దరు ఆటగాళ్లు మిస్సయ్యారు. వారిని అప్పటికల్లా తాజాగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఉండటంతో దాన్ని దృష్టిలోపెట్టుకొని కొంతమంది యువకులకు వ్యక్తిగతంగా అవకాశాలివ్వాలని భావించాం. ఇక శ్రీలంకతో పరిస్థితులు మరోలా ఉంటాయి, ఆ జట్టుతో సవాళ్లు ఎదురువుతాయి. అయితే, నేను ప్రత్యర్థిని చూసి భయపడే రకం కాదు. ఒక జట్టుగా మేం ఎలా ఆడగలమనేదే ఆలోచిస్తా. ప్రస్తుతం మా జట్టులో ఫీల్డింగ్, క్యాచింగ్ విషయాల్లో తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంది. త్వరలోనే వాటిని సరిచేసుకుంటామనే నమ్మకం ఉంది’ అని టీమ్ఇండియా సారథి వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!