IND vs WI: భారత్‌, వెస్టిండీస్‌ టీ20 మరింత ఆలస్యం

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మరింత ఆలస్యంకానుంది. తొలుత భారత కాలమానం ప్రకారం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ రెండు..

Updated : 01 Aug 2022 21:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మరింత ఆలస్యంకానుంది. తొలుత భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ అనివార్య కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యం కానున్నట్లు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అయితే, రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్న అభిమానులకు మరో గంట వేచిచూడాల్సిన అవసరం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 11 గంటలకు మొదలవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని