IND VS WI: వెస్టిండీస్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే

వరుస సిరీస్‌లతో టీమ్‌ఇండియా బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌

Published : 06 Jul 2022 18:00 IST

కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్‌గా జడేజా

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సిరీస్‌లతో టీమ్‌ఇండియా బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉంది. ఇక్కడ మూడు టీ20లు ,మూడు వన్డేలు( జులై 7 నుంచి 17 వరకు) ఆడనుంది. దీని తరవాత ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు సిద్ధమవ్వాలి. దీనికోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు శిఖర్‌ ధావన్‌ నాయకత్వం వహించనున్నాడు. సెలక్టర్లు సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ,బుమ్రా, భువి, షమిలతో పాటు యువ బ్యాటర్‌ రిషబ్‌పంత్‌కు విరామం ఇచ్చారు. కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా అందుబాటులో లేడు. టీమ్‌ఇండియా ఈ నెల 22 ,24, 27 తేదీలలో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా మూడు వన్డేలను ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తోనే జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఐదు మ్యాచులు టీ20 సిరీస్‌లో పోటీపడుతుంది. అయితే టీ20లకు ఇంకా సెలక్టర్లు జట్టును ప్రకటించలేదు.

విండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని