Venkatesh iyer: ప్రపంచ జట్టులో ఆడాలనుకున్నా కానీ..: వెంకటేశ్ అయ్యర్
ప్రంపచజట్టులో స్థానం సంపాదించలేకపోవడంపై వెంకటేశ్ అయ్యర్ తాజాగా స్పందించాడు. భారత టీ20 లీగ్లో కోల్కతా తరఫున అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన వెంకటేశ్ టీమ్ఇండియా జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోతున్నాడు.
దిల్లీ: కోల్కతా జట్టు స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భాగంగా గతేడాది టీమ్ఇండియాలోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది భారత టీ20 లీగ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ఆల్రౌండర్ను హార్దిక్ పాండ్య స్థానంలో బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. అయితే, ఆసియా కప్తో హార్దిక్ తిరిగి ఫామ్ అందుకోవడంతో ఇటీవల జరిగిన ప్రపంచకప్ జట్టులోకి వచ్చేందుకు ఈ ఆటగాడికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఈ బ్యాటర్ ఎప్పటికైనా జట్టులో చేరి ఉత్తమ ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘‘టీమ్ఇండియాలో ఎక్కువ కాలం కొనసాగాలని అందరూ కోరుకుంటారు. నేనూ అదే అనుకున్నాను. కానీ, హర్దిక్ భాయ్ తిరిగి జట్టులోకి వచ్చిన పరిస్థితులు నాకు తెలుసు. అతడు చేసింది అద్భుతమనే చెప్పాలి. ప్రపంచకప్ కోసం ఉత్తమ జట్టును ఎంపిక చేసుకోవాలనే అన్ని జట్లు కోరుకుంటాయి. నేను కూడా టీమ్ఇండియాలో ఆడాలనుకున్నాను. కానీ అది మన చేతుల్లో లేదు. నేనెప్పుడూ క్రికెట్ను ఒక అవకాశంగా చూస్తాను. ప్రధాన జట్టులో చోటుదక్కకపోతే భారత టీ20 లీగ్.. అదీ లేకపోతే దేశీయ క్రికెట్లో సొంత రాష్ట్రం తరఫున ఆడతాను. ఆట పరంగా గొప్ప ప్రదర్శన చేయడమే నా పని. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించను. కివీస్తో టీ20 సిరీస్, వన్డేల్లో నేను ఆడాల్సింది. కానీ, గాయం కారణంగా వీటికి దూరమయ్యాను. నాకు ప్రపంచ జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాను.’’ అని అన్నాడు.
మొదటినుంచీ కోల్కతా తరఫున ఓపెనర్గా ఆడిన ఈ ఆల్రౌండర్కు జట్టులో మాత్రం హార్దిక్ స్థానంలో ఫినిషర్ పాత్ర పోషించాల్సి వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. ‘‘ జట్టులో అప్పటికే కేఎల్ రాహుల్, రోహిత్ భాయ్, ఇషాన్ కిషన్ వంటి ఓపెనర్లు ఉన్నారు. కాబట్టి నేను ఆ స్థానంలో ఆడనని ముందే తెలుసు. రోహిత్ శర్మతో ఇదే విషయంపై చర్చించినప్పుడు నన్ను ఫినిషర్గా తీసుకోనున్నారని వివరించాడు. మనకు పూర్తిగా కొత్త పాత్ర ఇచ్చినప్పుడు వారి నుంచి మనకు మద్దతు సైతం లభిస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నా వెంట నిలిచారు’’ అంటూ వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’