WTC Final: నల్ల రిబ్బన్లతో మైదానంలోకి క్రికెటర్లు.. ఎందుకంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, టీమ్ఇండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా జరుగుతోంది. టాస్ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్, ఆసీస్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపన సందర్భంగా నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇటీవల ఒడిశాలో భారీ రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 270 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. దీంతో మృతి చెందిన వారికి సంతాపసూచికంగా ఆసీస్, భారత్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించారు. ఈ సందర్భంగా మౌనం వహించి నివాళులర్పించారు.
నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో టీమ్ఇండియా బరిలోకి దిగింది. సీనియర్ బౌలర్ అశ్విన్ను బెంచ్కే పరిమితం చేసిన టీమ్ఇండియా.. జడేజాను తీసుకుంది. అలాగే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ను ఎంపిక చేసుకుంది. టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నలుగురు సీమర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. అలాగే స్పిన్నర్గా జడేజాను తీసుకున్నాం. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ను పక్కన పెట్టడం కఠిన నిర్ణయమే. అతడు మ్యాచ్ విన్నర్’’అని వ్యాఖ్యానించాడు. రోహిత్కిది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్కు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను సిరాజ్ పెవిలియన్కు చేర్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..