IND vs AUS: ఉప్పల్లో అదరగొట్టిన భారత్.. ఆసీస్పై సిరీస్ కైవసం
ఉప్పల్లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
హైదరాబాద్: ఆస్ట్రేలియాను భారత్ మట్టికరిపించింది. మూడు టీ20ల సిరీస్ను 2-1తో పట్టేసింది. దీంతో పొట్టి ప్రపంచకప్ సమీస్తున్న వేళ ఈ సిరీస్ విజయం టీమ్ఇండియాకు ఆత్మవిశ్వాసం కలిగించినట్లైంది. ఇక ఈ సిరీస్లో ఉత్తమంగా రాణించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ సిరీస్గా ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్ టీ20లోనూ ఆసీస్పై టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (69: 36 బంతుల్లో 5 సిక్స్లు, 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (63: 48 బంతుల్లో 4 సిక్స్లు, 3 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 104 పరుగులను జోడించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో హార్దిక్ పాండ్య (25*) అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లలో డానియల్ సామ్స్ 2. జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.
దంచేసిన డేవిడ్, గ్రీన్
ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడాడు. పవర్ ప్లేలో భారీగా పరుగులు (66) చేసిన ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే చివర్లో మరోసారి పట్టు విడవడంతో ఆసీస్ బ్యాటర్లు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా టిమ్ డేవిడ్ (54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షల్, భువనేశ్వర్ వేసిన డెత్ ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టాడు. ఓ దశలో ఆసీస్ 150 స్కోరైనా చేస్తుందా..? అని భావించినప్పటికీ చివరికి 186 పరుగులు చేయడంలో టెయిలెండర్ బ్యాటర్ డానియల్ సామ్స్ (28*) కూడా కారణం. టిమ్ డేవిడ్-సామ్స్ కలిసి ఏడో వికెట్కు 68 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని విశేషాలు..
* టీ20ల్లో భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లలో రోహిత్ శర్మ (33) రెండో స్థానానికి చేరాడు. విరాట్ కోహ్లీ (32)ని అధిగమించాడు. టాప్ ప్లేస్ మాత్రం మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (42)దే.
* 2021 తర్వాత భారత్ 14 మ్యాచుల్లో ఛేదన చేస్తే.. 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
* ఆస్ట్రేలియాపై ఇది నాలుగో రన్ ఛేజ్: 187/4. ఇంతకుముందు రాజ్ కోట్ (2013)లో 202 పరుగులు, సిడ్నీ (2016)లో 198 పరుగులు, సిడ్నీ (2020)లో 195 పరుగులను భారత్ ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.