IND vs AUS: ఉప్పల్లో అదరగొట్టిన భారత్.. ఆసీస్పై సిరీస్ కైవసం
ఉప్పల్లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
హైదరాబాద్: ఆస్ట్రేలియాను భారత్ మట్టికరిపించింది. మూడు టీ20ల సిరీస్ను 2-1తో పట్టేసింది. దీంతో పొట్టి ప్రపంచకప్ సమీస్తున్న వేళ ఈ సిరీస్ విజయం టీమ్ఇండియాకు ఆత్మవిశ్వాసం కలిగించినట్లైంది. ఇక ఈ సిరీస్లో ఉత్తమంగా రాణించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ సిరీస్గా ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్ టీ20లోనూ ఆసీస్పై టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (69: 36 బంతుల్లో 5 సిక్స్లు, 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (63: 48 బంతుల్లో 4 సిక్స్లు, 3 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 104 పరుగులను జోడించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో హార్దిక్ పాండ్య (25*) అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లలో డానియల్ సామ్స్ 2. జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.
దంచేసిన డేవిడ్, గ్రీన్
ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడాడు. పవర్ ప్లేలో భారీగా పరుగులు (66) చేసిన ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే చివర్లో మరోసారి పట్టు విడవడంతో ఆసీస్ బ్యాటర్లు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా టిమ్ డేవిడ్ (54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షల్, భువనేశ్వర్ వేసిన డెత్ ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టాడు. ఓ దశలో ఆసీస్ 150 స్కోరైనా చేస్తుందా..? అని భావించినప్పటికీ చివరికి 186 పరుగులు చేయడంలో టెయిలెండర్ బ్యాటర్ డానియల్ సామ్స్ (28*) కూడా కారణం. టిమ్ డేవిడ్-సామ్స్ కలిసి ఏడో వికెట్కు 68 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని విశేషాలు..
* టీ20ల్లో భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లలో రోహిత్ శర్మ (33) రెండో స్థానానికి చేరాడు. విరాట్ కోహ్లీ (32)ని అధిగమించాడు. టాప్ ప్లేస్ మాత్రం మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (42)దే.
* 2021 తర్వాత భారత్ 14 మ్యాచుల్లో ఛేదన చేస్తే.. 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
* ఆస్ట్రేలియాపై ఇది నాలుగో రన్ ఛేజ్: 187/4. ఇంతకుముందు రాజ్ కోట్ (2013)లో 202 పరుగులు, సిడ్నీ (2016)లో 198 పరుగులు, సిడ్నీ (2020)లో 195 పరుగులను భారత్ ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్