ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023.. అశ్విన్ సూచనను సమర్థించిన భారత బౌలింగ్ కోచ్
ప్రపంచకప్ మ్యాచ్లను కాస్త ముందుగానే ప్రారంభించాలని ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అశ్విన్ సూచనను సమర్థించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ మ్యాచ్లను కాస్త ముందుగానే ప్రారంభించాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సమర్థించాడు. అయితే ఈ విషయంలో ఐసీసీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అతడు స్పష్టం చేశాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నవంబరు లేదా డిసెంబరు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2023 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతోందన్న విషయం తెలిసిందే. అప్పుడు భారత్కు శీతాకాలం ప్రారంభమవుతుంది. మంచు వల్ల రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల అశ్విన్.. మంచు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రపంచకప్ మ్యాచ్ల సమయాన్ని ముందుకు జరిపితే బాగుంటుందని సూచించాడు. దీంతో అశ్విన్ సూచనకు పలువురు క్రికెటర్లు మద్ధతు పలుకుతున్నారు. తాజాగా టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ కూడా స్పందించాడు.
‘‘అశ్విన్ ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించాడు. కొన్ని వేదికల్లో మంచు ప్రభావం చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ ఆడుతున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. మంచు వల్ల బంతి స్పిన్ అవకపోతే బ్యాటింగ్ సులభమవుతుంది. ఈ విషయంపై ఐసీసీ దృష్టి పెట్టాలి’’ అని మాంబ్రే వెల్లడించాడు. ఇక శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ విభిన్నంగా ఉంటుందని మాంబ్రే పేర్కొన్నాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలరని అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అతడు వ్యాఖ్యానించాడు.
‘‘మేము పిచ్లను గమనించి దాని ప్రకారమే ఎవరి కాంబినేషన్ బాగుంటుందో నిర్ణయిస్తాం. శార్దూల్ని అలానే ఎంపిక చేశాం. అతడి బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అతడు భారత్ తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు. ఉమ్రాన్ వేగంతో వివిధ కోణాల్లో బంతులు విసురుతాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతడిని రీప్లేస్ చేయడం కష్టం. అతడి నైపుణ్యాలను ప్రతిబింబించేవారు లేరు. వన్డే, టీ20 సిరీస్లలో అందరికీ అవకాశాలు ఇవ్వాలి. వారి ప్రదర్శనను, ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారో పరీక్షించాలి. మేము ఎక్కువ ప్రయోగాలను చేయాలనుకోవట్లేదు. ప్రపంచకప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వారిని పరీక్షిస్తున్నాం’’ అని మాంబ్రే పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు