CWG 2022 : డబుల్స్ టీటీ.. రజతంతో సరిపెట్టుకున్న భారత్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో రజతంతో భారత్‌ సరిపెట్టుకుంది. ఫైనల్‌లో శరత్ - సతియాన్‌ జోడీ...

Published : 07 Aug 2022 21:12 IST

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో రజతంతోనే భారత్‌ సరిపెట్టుకుంది. ఫైనల్‌లో శరత్ - సతియాన్‌ జోడీ ఇంగ్లాండ్‌ ప్లేయర్లు పాల్‌ డ్రింక్‌హాల్, లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఐదు సెట్ల గేమ్‌లో తొలి సెట్‌ను 11-8తో గెలిచి భారత్‌ జోడీ ముందంజ వేసింది. అయితే వరుసగా రెండు సెట్లను (8-11, 3-11) ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. ఆ తర్వాత నాలుగో సెట్‌ను భారత్‌ (11-7) గెలవడంతో    మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. స్వర్ణ పతకం అందించే నిర్ణయాత్మక చివరి సెట్‌నూ భారత్ ప్లేయర్లు చేజార్చుకున్నారు. 11-4తో ఇంగ్లాండ్ చివరి సెట్‌ను గెలిచింది. దీంతో 3-2 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. 

మరోవైపు, బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్ సెమీఫైనల్‌లో భారత్‌కు చెందిన త్రీసా జోలీ- గాయత్రీ గోపీచంద్‌ జోడీ ఓటమిపాలైంది. మలేషియా చేతిలో 2-0తో ఓడిపోయింది. అయితే కాంస్య పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. పురుషుల డబుల్స్ ఫైనల్‌లోకి భారత్‌ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి దూసుకెళ్లారు. ఇంగ్లాండ్‌ జోడీతో ఫైనల్‌లో తలపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని