Asia Cup : టీమ్ఇండియాకు షాక్.. రాహుల్కు కరోనా పాజిటివ్
మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం దాయాదుల మధ్య పోరు జరగనుంది. యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొనేందుకు...
ఇంటర్నెట్ డెస్క్: మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం దాయాదుల మధ్య పోరు జరగనుంది. యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొనేందుకు జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి ఉంది. దానికి కారణం ద్రవిడ్ కరోనా బారిన పడటం. యూఏఈ వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్కు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే పాక్తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమ్ఇండియాకు రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ద్రవిడ్తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలెక్షన్ కమిటీ ఆ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య వంటి సీనియర్లకు అవకాశం కల్పించింది. అయితే గాయం కారణంగా కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు. స్టాండ్బై ఆటగాళ్లుగా అక్షర్ పటేల్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ను తీసుకుంది. ఒకవేళ ద్రవిడ్ అందుబాటులోకి రాకపోతే.. జింబాబ్వేతో సిరీస్కు కోచ్గా వ్యవహరించిన లక్ష్మణ్ ఆసియా కప్లోనూ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని