ఇంగ్లాండ్ లోపాల్ని భారత్ ఎత్తి చూపింది : మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్
ఓవల్ మైదానంలో సాధించిన ఘన విజయంతో భారత్.. ఇంగ్లాండ్ జట్టు లోపాల్ని ఎత్తి చూపిందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నాడు. ‘నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది.
లండన్ : ఓవల్ మైదానంలో సాధించిన ఘన విజయంతో భారత్.. ఇంగ్లాండ్ జట్టు లోపాల్ని ఎత్తి చూపిందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నాడు. ‘నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. క్యాచులు నేలపాలు చేయడంతో మొదలైన ఈ వైఫల్యం బ్యాటింగ్, బౌలింగ్ చేయడంలోనూ స్పష్టంగా కనిపించింది. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వికెట్లు తీసేందుకు చాలా కష్టపడ్డారు’ అని వాన్ అన్నాడు.
‘గత రెండు సంవత్సరాలుగా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ మెరుగుపడలేదు. తరుచుగా క్యాచులు వదిలేస్తూ విజయానికి దూరమవుతోంది. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 125 పరుగులకే భారత్ని కట్టడి చేసే అవకాశం వచ్చినా.. క్యాచులు వదిలేయడంతో ఆ జట్టు 191 పరుగులు చేయగలిగింది. అలాగే మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ భారీ పరుగులు చేయలేకపోయింది. బ్యాట్స్మెన్ ఏకాగ్రత లోపించి చెత్త షాట్లు ఆడుతున్నారు. ఓపెనర్ హసిబ్ హమీద్ వైడ్ బాల్ని వేటాడి ఔటయ్యాడు. అలాగే, మొయిన్ అలీ అనవసర షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్లో కూడా కొత్తదనం లోపించింది. ఆటగాళ్లు ఎక్కువగా పిచ్పై ఆధార పడుతున్నారు. పిచ్ సహకరిస్తే 20 వికెట్లు తీస్తున్నారు. లేకపోతే పూర్తిగా తేలిపోతున్నారు’ అని వాన్ పేర్కొన్నాడు.
‘బ్యాట్స్మెన్ మధ్య సమన్వయం కూడా లోపించింది. డేవిడ్ మలన్ రనౌట్ అవ్వడమే అందుకు మంచి ఉదాహరణ. ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాలి. అయితే, హమీద్ సింగిల్కు పిలుస్తాడని ఊహించని డేవిడ్ మలన్.. అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. అలాగే జట్టు కూర్పులో కూడా లోపాలున్నాయి. మంచి ఫామ్లో ఉన్న మార్క్ వుడ్ని పక్కన పెట్టడం తప్పుడు నిర్ణయం. పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని ఎలా అధిగమించాలో కూడా ఇంగ్లాండ్ జట్టు తెలుసుకోవాలి. రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న మొయిన్ అలీని వైస్ కెప్టెన్గా నియమించడంతో కొంత గందర గోళానికి గురయ్యాను. అతడు ఇంకా జట్టులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి బదులుగా.. రెగ్యులర్గా టీమ్లో ఆడుతున్న రోరీ బర్న్స్కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం ఉత్తమం’ అని వాన్ సూచించాడు.
నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో వెనుక బడిన టీమిండియా అనూహ్యంగా పుంజుకుని 157 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచుల ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!