రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ విజేతగా భారత్
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను గెలిచి ఆనందంలో ఉన్న భారత అభిమానులకు దిగ్గజాలు మరో సంతోషాన్ని నింపారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ను భారత్ లెజెండ్స్ జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ను
రాయ్పుర్: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను గెలిచి ఆనందంలో ఉన్న భారత అభిమానులకు దిగ్గజాలు మరో సంతోషాన్ని నింపారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ను భారత్ లెజెండ్స్ జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ను మట్టికరిపించి భారత్ జయభేరి మోగించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేసింది. ఆ జట్టులో సనత్ జయసూర్య (43) టాప్ స్కోరర్. జయసింఘే(43), వీరరత్నే(38) రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో శ్రీలంక ఓటమి చవిచూసింది. భారత బౌలర్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ చెరో రెండు వికెట్లు, మన్ప్రీత్ గోనీ, మునాఫ్ పటేల్ చెరో వికెట్ తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
చెలరేగిన యూసఫ్, యువరాజ్
తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన భారత్ లెజెండ్స్ 19 పరుగుల వద్ద 19 పరుగుల వద్ద సెహ్వాగ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం 35 పరుగుల వద్ద బద్రీనాథ్ రూపంలో మరో వికెట్ చేజార్చుకుంది. ఈ సమయంలో ఒత్తిడిలో ఉన్న భారత్ను కెప్టెన్ సచిన్, యువరాజ్ సింగ్(41 బంతుల్లో 4X4, 5X6) ఆదుకున్నారు. ఈ క్రమంలో సచిన్ (30: 23 బంతుల్లో 4X5)ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్(62* 36 బంతుల్లో 4X4, 5X6)యువరాజ్ సింగ్తో కలిసి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా మెరుపు బ్యాటింగ్తో ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొలిపి భారత్ను పటిష్ట స్థితిలో నిలిపారు. దీంతో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో హెరత్, జయసూర్య, మహరూఫ్, వీరరత్నే తలో వికెట్ తీశారు. అర్ధశతకంతో పాటు రెండు వికెట్లు తీసిన యూసఫ్ పఠాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. టోర్నీలో 271 పరుగులు చేసి, 12 వికెట్లు తీసిన శ్రీలంక ఆటగాడు తిలకర్నతే దిల్షాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
ఇక భారత్ తరఫున టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ (233) అత్యధిక పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్(9) అత్యధిక వికెట్లు తీశాడు.
ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సిరీస్ను నిర్వహించారు. 2020లో ప్రారంభించిన ఈ టోర్నీలో తొలుత నాలుగు మ్యాచ్లు జరిగాయి. అనంతరం కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మ్యాచ్లను వాయిదా వేశారు. అనంతరం 2021లో ఈ టోర్నీని కొనసాగించారు. మార్చి 5న ఈ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో భారత్ లెజెండ్స్ బంగ్లాదేశ్ లెజెండ్స్తో తలపడింది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు చత్తీస్గఢ్లోని రాయ్పుర్లో గల షాహిద్ వీర్ నారాయణ్సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!