IND vs PAK: పోరాడి ఓడిన భారత్.. ఉత్కంఠ పోరులో పాక్ విజయం
అండర్-19 ఆసియా కప్లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. చివరి ఓవర్ వరకు...
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్లో భారత్కు పాకిస్థాన్ చేతిలో ఓటమి ఎదురైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియాపై పాక్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ బౌలర్ జీషన్ జమీర్ 5 వికెట్లతో చెలరేగడంతో.. భారత్ 49 ఓవర్లో 237 పరుగులకు ఆలౌటైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఛేదనలో పాక్ సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది.
చివరి వరకూ పోరాడినా..
మోస్తరు లక్ష్యంతో (238) బరిలోకి దిగిన పాకిస్థాన్కి ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత బౌలర్ రాజవర్థన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే పాక్ ఓపెనర్ అబ్దుల్ వహీద్ (0) డకౌట్ అయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ ముహమ్మద్ షెహజాద్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 159/5 (36 ఓవర్లు) స్కోరుతో నిలిచింది. ఇర్ఫాన్ ఖాన్ (32), రిజ్వాన్ మహమ్మద్ (29) ఆరో వికెట్కు 47 పరుగులు జోడించారు. భారత బౌలర్ రాజ్ భవా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి రెండు ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగులు చేయాల్సి వచ్చింది. 49వ ఓవర్లో రాజవర్ధన్ వేసిన అహ్మద్ ఖాన్ ఓ ఫోర్, ఓ సిక్స్ బాదాడు. అయితే రవి కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికే జీషన్ జమీర్ ఔటయ్యాడు. దీంతో సమీకరణం ఐదు బంతుల్లో 8 పరుగులకు మారింది. తర్వాతి రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు, ఐదు బంతులకు అహ్మద్
ఖాన్ రెండు డబుల్స్ తీశాడు. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండటంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. అయితే చివరి బంతిని అహ్మద్ ఖాన్ బౌండరీకి తరలించడంతో భారత్కి ఓటమి ఖాయమైంది. టీమ్ఇండియా బౌలర్లలో రాజ్ భవా 4, రాజవర్థన్, రవికుమార్, నిశాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు.
ఆదుకున్న ఆరాధ్య యాదవ్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. రఘువన్షి (0) డకౌట్గా వెనుదిరిగాడు. పాక్ బౌలర్లు విజృంభించడంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ (50: 83 బంతుల్లో 3×4), కౌషల్ తంబే (32: 38 బంతుల్లో 4×4) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన రాజవర్థన్ (33: 20 బంతుల్లో 5×4,1×6) ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్ 5, అవైస్ అలీ 2, ఖాసీమ్ అలీ, మాజ్ సదాఖత్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత