తెర వెనుక ద్రవిడ్.. తెర ముందు టీమ్ఇండియా
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను టీమ్ఇండియా సౌథాంప్టన్లో ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. జూన్ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ అక్కడ తలపడతాయని ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించిందని ప్రశంసించారు..
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వేదిక సౌథాంప్టన్
యువీ, వీరూ, ధోనీలా పంత్ మ్యాచ్ విజేతన్న దాదా
దిల్లీ: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను టీమ్ఇండియా సౌథాంప్టన్లో ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. జూన్ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ అక్కడ తలపడతాయని ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించిందని ప్రశంసించారు. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో తెరవెనుక ద్రవిడ్ ఎంతగానో శ్రమించాడని అభినందించారు. రిషభ్ పంత్ను గొప్ప మ్యాచ్ విజేతగా అభివర్ణించారు.
బయో బుడగ కోసమే
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను ప్రకటించినప్పుడు ఫైనల్ వేదికగా లార్డ్స్ను నిర్ణయించారు. కరోనా వైరస్ వల్ల బయో బుడగను ఏర్పాటు చేసేందుకు లార్డ్స్లో వసతులు లేవు. దాంతో ఐదు నక్షత్రాల వసతి ఉన్న సౌథాంప్టన్కు వేదికను మార్చారని తెలిసింది. ‘అవును, ఫైనల్ను సౌథాంప్టన్లో నిర్వహిస్తారు’ అని పీటీఐ అడిగిన ప్రశ్నకు దాదా జవాబిచ్చారు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు నేను వెళ్తాను. అక్కడ న్యూజిలాండ్ను ఓడిస్తామన్న నమ్మకం ఉంది. మనకన్నా ముందే కివీస్ అక్కడి చేరుకొని ఇంగ్లాండ్తో ఆడనుంది’ అని తెలిపారు. కాగా లార్డ్స్తో పోలిస్తే సౌథాంప్టన్ మందకొడి పిచ్. స్పిన్కు మరింత అనుకూలిస్తుంది.
ప్రశంసించాల్సిందే
ఆసీస్, ఇంగ్లాండ్పై సిరీసులు గెలిచిన టీమ్ఇండియాపై దాదా ప్రశంసలు కురిపించారు. ‘జట్టు గొప్పగా ఆడింది. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడింది. అయిపోగానే గదుల్లోకి వెళ్లింది. ఐపీఎల్ నుంచి వారు సాధించిన ప్రతిదీ అద్భుతమే. మనం కచ్చితంగా అజింక్య రహానెను అభినందించాలి. మొదట అతడు ఆసీస్లో జట్టును విజయపథంలో నడిపించాడు. ఇంగ్లాండ్పై కోహ్లీ, కోచ్, సహాయ సిబ్బంది, ప్రతి ఒక్కరినీ ప్రశంసించాలి. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో తెరవెనుక ద్రవిడ్ శ్రమించాడు. బ్రిస్బేన్ ఫలితమే అందుకు ఉదాహరణ’ అని గంగూలీ తెలిపారు.
పంత్ మ్యాచ్ విజేత
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్సింగ్, మహేంద్రసింగ్ ధోనీలా రిషభ్ పంత్ మ్యాచ్ విజేతని దాదా అన్నారు. ‘రెండేళ్లుగా పంత్ను చూస్తున్నా. మ్యాచ్ విజేతలపై నేను నమ్మకం ఉంచుతాను. తమదైన రోజున మ్యాచులు గెలిపించే వారుంటారు. అలాంటివాడే పంత్. సిడ్నీ టెస్టులో అతడు మరో ఆరు ఓవర్లు ఉంటే మ్యాచ్ను గెలిపించేవాడే. అతడు ధోనీ, యువీ, సెహ్వాగ్లా మ్యాచులు గెలిపించగలడు. అహ్మదాబాద్లో ఎలా ఆడాడో చూడండి. జేమ్స్ అండర్సన్ కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి తెలివితేటలను గమనించండి. ప్రతిదాడి చేసి మొత్తం మార్చేశాడు’ అని అన్నారు.
తెరవెనుక రాహుల్
జాతీయ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ శ్రమించడంతోనే టీమ్ఇండియా రిజర్వుబెంచ్ ఇంత పటిష్ఠంగా ఉందని దాదా స్పష్టం చేశారు. జస్ప్రీత్ బుమ్రా లేకుండా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆసీస్పై ఆఖరి టెస్టులో గెలిపించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగుందని, వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవని చెప్పారు. గుండెపోటుతో భయపడలేదని త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పడంతో శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. రెండు, మూడో టీ20 వీక్షించేందుకు అహ్మదాబాద్ వెళ్తానని వెల్లడించారు.
రాజకీయాలపై..
తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై దాదా స్పందించారు. ‘ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం. ఎలాంటి అవకాశాలు వస్తాయో చూసి నిర్ణయించుకోవాలి. నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. సచిన్ నాయకత్వం వహిస్తే నాకు సారథ్యం వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ అతడు రాజీనామా చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడిగానూ అంతే. నిమిషాల ముందు వరకు అధ్యక్షుడిని అవుతానని తెలియదు. నా జీవితం అలా ఉంటోంది మరి. రాజకీయ అవకాశాలు వచ్చాయి. కుటుంబం, జీవన శైలి, ఆరోగ్యం, పని వంటి చాలా అంశాలు దానిపై ప్రభావితం చేస్తాయి. ప్రజల్లో నాపై ఇంత అభిమానం ఉండటం సంతోషం. అందుకే వారిని నిత్యం కలుస్తూనే ఉంటాను.
రిస్క్ కాబట్టే అనుమతించలేదు
లాజిస్టిక్స్ సమస్య వల్లే ఐపీఎల్ తొలి అంచె మ్యాచులకు అభిమానులు అనుమతించడం లేదని గంగూలీ తెలిపారు. తాము సరిగ్గా ప్రణాళిక వేశామని, దఫదఫాలుగా మ్యాచులు నిర్వహిస్తున్నామన్నారు. ‘ప్రతి జట్టుకు మూడు విమానాలు వినియోగిస్తాం. ఇంగ్లాండ్ సిరీసుల కోసం రెండు మాత్రమే వినియోగించాం. సంఖ్య తక్కువే గానీ దుబాయ్లో లీగ్ను విజయవంతం చేసిన అనుభవం బీసీసీఐకి ఉంది. ఇప్పుడూ అలాగే చేస్తాం. పరిస్థితులను బట్టి అభిమానులను అనుమతిస్తాం. దుబాయ్లోనూ అంతే. ద్వైపాక్షిక సిరీసులు, ఐపీఎల్కు తేడా ఉంది. లీగు కోసం అనుమతిస్తే అభిమానులు ఆటగాళ్లను సమీపించే అవకాశం ఉంటుంది. అది కాస్త రిస్కే’ అని దాదా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!