Tokyo olympics: ‘లండన్’ రికార్డు బ్రేక్.. భారత్ సరికొత్త పతకాల రికార్డు
టోక్యో ఒలింపిక్స్ భారత్ గొప్ప ప్రదర్శన చేసింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను ఒడిసి పట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్ భారత్ గొప్ప ప్రదర్శన చేసింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను ఒడిసి పట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది. 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్లో ఆరు పతకాలు రికార్డే ఇప్పటి వరకు అత్యధికం. ఆ రికార్డును తాజాగా చెరిపేసింది. పతకాలు సాధిస్తారని ఆశించిన స్టార్లు నిరాశ పరిచినా.. కొత్త స్టార్లు ముందుకొచ్చి సరికొత్త రికార్డును అందించడం ఈసారి విశేషం.
వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్లో శుక్రవారం వరకు భారత్ సాధించిన పతకాలు ఐదే. వాటిలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ ఆదివారంతో ముగియనుండగా.. భారత క్రీడాకారులు పాల్గొనే క్రీడాంశాలు శనివారంతోనే ముగిశాయి. చివరి రోజు ముగ్గురు క్రీడాకారులే పతక బరిలో నిలిచారు. దీంతో లండన్ రికార్డును దాటలేమా అన్న మీమాంస నెలకొంది. ఉదయం అదితి నిరాశ పరచినా.. బజరంగ్ పునియా కాంస్యంతో అదరగొట్టి ఆశలు చిగురింపజేశాడు. నీరజ్ చోప్రా ఆ కలను నిజం చేశాడు. ఇప్పటి వరకు స్వర్ణ పతకం సాధించలేదన్న సగటు భారతీయుల కలను నెరవేరుస్తూ జావెలిన్ త్రోలో స్వర్ణంతో మెరిశాడు. అంతేకాదు వ్యక్తిగత విభాగంలో భారత్కు స్వర్ణం సాధించిపెట్టాడు. అథ్లెటిక్స్లో వందేళ్ల చరిత్రలో తొలి పతకం సాధించి చరిత్ర లిఖించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్లో భారత్ 47వ స్థానంలో నిలవగలిగింది. ప్రస్తుతం చైనా, అమెరికా తొలి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.
టోక్యోలో మనం..
టోక్యో ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి ఛాను సిల్వర్ పతకం సాధించడంతో భారత పతకాల వేట ప్రారంభమైంది. బ్యాడ్మింటన్లో సింధు కాంస్యంతో అలరించింది. బాక్సర్ లవ్లీనా కాంస్యంతో మెరిసింది. పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంస్య పతకం సాధించగా.. రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకంతో మెరిశాడు. చివరి రోజైన శనివారం భజరంగ్ పునియా కాంస్యంతో రాణించగా.. నీరజ్ చోప్రా స్వర్ణంతో సత్తా చాటాడు. దీంతో ఇప్పటి వరకు లండన్ (రెండు రజత, నాలుగు కాంస్య) పేరిట ఉన్న పతకాల రికార్డును భారత్ అధిగమించినట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు