IND vs NZ: సవాళ్లను స్వీకరించడం బాగుంటుంది.. అందుకే తొలుత బ్యాటింగ్: హార్దిక్ పాండ్య
కొత్త ఏడాదిలో వరుసగా నాలుగో సిరీస్ను భారత్ (Team India) కైవసం చేసుకొంది. ఇందులో శ్రీలంక (IND vs SL), న్యూజిలాండ్ (IND vs NZ) జట్లతో వన్డే, సిరీస్లు ఉన్నాయి. తాజాగా కివీస్తో కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ‘మిషన్ 2024’లో భాగంగా ఘనంగా అడుగులు పడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్పై మూడు టీ20ల సిరీస్ను భారత్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. శుభ్మన్ గిల్ (126*), హార్దిక్ పాండ్య (4/16) రాణించడంతో కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 168 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 చరిత్రలోనే అత్యంత భారీ విజయం ఇదే కావడం విశేషం. సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు, హార్దిక్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం గిల్, పాండ్య మాట్లాడారు.
నేను కొంచెం తగ్గినా.. : హార్దిక్
‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడం గురించి ఆలోచించలేదు. అయితే పెద్ద స్టేడియంలో అనుకొన్న విధంగా రాణించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతోపాటు ట్రోఫీని సొంతం చేసుకోవడంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఉంది. మైదానం వెలుపల వారి సహకారం ఎనలేనిది. ఇలాంటి మ్యాచ్ ఆడటం నాకెంతో ఇష్టం. నేను ముందస్తు ఆలోచనలు చేయను. విజయానికి ఏమి అవసరమో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. నా ఉద్దేశం ఒక్కటే.. కెప్టెన్గా నా ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తా. దూకుడుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. ఒకవేళ నేను కాస్త తగ్గితే.. నా టర్మ్స్ కూడా మారిపోతాయి. సవాళ్లను స్వీకరించడం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఇక్కడే మేం ఐపీఎల్ ఫైనల్ ఆడాం. అప్పుడు రెండో ఇన్నింగ్స్ కఠిన సవాల్ ఎదురైంది. కానీ, ఈ మ్యాచ్ను మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా సింపుల్గా ఆడాలని భావించాం. ఎందుకంటే ఇది సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేశాం. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. భవిష్యత్తులో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తాం’’
పెద్ద స్కోరు సాధించాలని భావించా: గిల్
‘‘కష్టపడి సాధన చేసిన తర్వాత ఫలితం ఇలా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. భారీ స్కోరు సాధించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా. శ్రీలంక సిరీస్లో ఇది కుదరలేదు. అయితే, ఇప్పుడు సాధించడం బాగుంది. ప్రతి ఒక్కరికి సిక్స్లు కొట్టేందుకు వేర్వేరు టెక్నిక్స్ ఉంటాయి. ‘నువ్వు ఎలా ఆడాలని భావిస్తున్నావో అలాగే ఆడేయు’ హార్దిక్ ఎప్పుడూ మాతో చెబుతుంటాడు. దేశం కోసం ఆడేటప్పుడు అలసట అనేదే ఉండదు. భారత్ కోసం ఆడాలనేది నా కల. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో ఆడటం నా అదృష్టం’’
మరికొన్ని విశేషాలు..
* సిరీస్ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్ హార్దిక్ యువ ఆటగాడు పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పృథ్వీ ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్లోనూ ఆడలేదు.
* ఇంతకుముందు టీ20ల్లో అతిపెద్ద విజయం కూడా భారత్ పేరిటే ఉంది. 2018లో 143 పరుగుల తేడాతో ఐర్లాండ్పై టీమ్ఇండియా విజయం సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్పై 168 తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
* న్యూజిలాండ్కు ఇది మూడో అత్యల్ప స్కోరు ఇది. ఇంతకుముందు శ్రీలంక, బంగ్లాదేశ్ మీద 60 పరుగులే చేసింది.
* అతిపెద్ద మైదానం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యధిక స్కోరు భారత్ పేరిటే నమోదైంది. గతంలో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా 224/2 స్కోరు చేయగా.. ఇప్పుడు కివీస్పై 234/4 సాధించింది.
* అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా గిల్(126*) రికార్డు సాధించాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ (122*) పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించాడు. రైనా, రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లిల తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు చేసిన భారత ఆటగాడు శుభ్మనే.
* స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ వరుసగా 25 సిరీసుల్లో అజేయంగా నిలిచింది. అలాగే స్వదేశంలో 50 టీ20 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ