ICC: టీ20ల్లో అగ్రస్థానంతో ముగించిన టీమ్‌ఇండియా..

టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమ్‌ఇండియా.. ప్రపంచ నంబర్ వన్ హోదాలో 2021-22 సీజన్‌ను ముగించింది.......

Updated : 04 May 2022 19:59 IST

ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత వరుసగా పొట్టి ఫార్మాట్ సిరీస్‌లను నెగ్గిన టీమ్‌ఇండియా.. ప్రపంచ నంబర్ వన్ హోదాలో 2021-22 సీజన్‌ను ముగించింది. కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నేతృత్వంలో స్వదేశంలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంకను వైట్‌వాష్‌ చేసింది. ఈ నేపథ్యంలో గత వారం వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా వెనక్కి నెట్టింది. 270 పాయింట్లతో భారత్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్లు ఐసీసీ ప్రకటించింది. 265 పాయింట్లతో ఇంగ్లాండ్‌, 261 పాయింట్లతో పాకిస్థాన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెస్టుల్లో ఆసీస్‌, వన్డేల్లో న్యూజిలాండ్‌ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని