Olympics: ఒలింపిక్స్-2036 పోటీలను నిర్వహించేందుకు భారత్ సంసిద్ధం: అనురాగ్ ఠాకూర్
ఒలింపిక్స్ (olympics)ను మించిన క్రీడా సంబరం మరొకటి ఉండదు. ఛాంపియన్లు పాల్గొనే ఒలింపిక్స్లో పతకం నెగ్గితే అదొక అద్భుతమే. అయితే ఇలాంటి క్రీడోత్సవాలను నిర్వహించాలంటే లక్షల కోట్లతో కూడిన వ్యవహారం. అలాంటి అవకాశం వస్తే భారత్ (india) ఏమాత్రం వదులుకోదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగే ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడం తేలికైన విషయం కాదు. మైదానాలు, ఆటగాళ్ల మౌలిక సదుపాయాలకు లక్షల కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన బిడ్లను దాఖలు చేసేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) సిద్ధమవుతోంది. దీని కోసం సెప్టెంబర్ 2023లో జరిగే అంతర్జాతీయయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎదుట ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రోడ్మ్యాప్ను తయారు చేస్తున్నట్లు ఐవోఏ వెల్లడించింది. ఐవోఏ నిర్ణయానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు.
‘‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వేయాలనే బిడ్కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఉంటుంది. ‘అతిథ్య నగరం’గా ఉండే అహ్మదాబాద్లో ప్రపంచస్థాయి క్రీడా వసతులు అందుబాటులో ఉన్నాయి. 1982లో ఆసియా గేమ్స్, 2010లో కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించిన అనుభవం భారత్కు ఉంది. అతిపెద్ద క్రీడోత్సవం ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఎదురు చూస్తోంది.2036 స్లాట్ కోసం బిడ్ దాఖలు చేసేందుకు భారత ఒలింపిక్ సంఘం సిద్ధమై ఉంటుందని అనుకొంటున్నా’’
‘‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ సిద్ధంగా ఉంటుంది. వద్దనడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. క్రీడలను ప్రమోట్ చేయడంలో భారత్ చాలా కృషి చేస్తుంది. అందుకే ఒలింపిక్స్తో పాటు ఎలాంటి క్రీడోత్సవాలనైనా సమర్థంగా నిర్వహించగలం. తయారీ రంగం నుంచి సేవల వరకు అన్నింట్లోనూ భారత్ ఉన్నప్పుడు.. క్రీడల్లో ఎందుకు ఉండకూడదు? అందుకే 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ దాఖలు చేసేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తుంది’’ అని వెల్లడించారు. 2024 ఒలింపిక్స్ను పారిస్, 2028 ఒలింపిక్స్ను లాస్ ఏంజెలెస్, 2032 ఒలింపిక్స్ను బ్రిస్బేన్ వేదికగా నిర్వహించేందుకు ఇప్పటికే ఐవోసీ ఖరారు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్