Aravinda de Silva : క్రికెట్ వృద్ధి కోసం.. టీ20 లీగ్లపై భారత్ పట్టు సడలించాలి: లంక మాజీ క్రికెటర్
భారత టీ20 లీగ్ సహా ఇతర టోర్నీలు క్రికెట్ వ్యాప్తికి చాలా ఉపయోగపడ్డాయని శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా తెలిపాడు. అయితే విదేశీ టోర్నమెంట్లలో...
(ఫొటో సోర్స్: లంక క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ సహా ఇతర టోర్నీలు క్రికెట్ వ్యాప్తికి చాలా ఉపయోగపడ్డాయని శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా తెలిపాడు. అయితే విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి భారత స్టార్ ఆటగాళ్లకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశాడు. జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ వంటి విదేశీ క్రికెటర్ల టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా చేయడంలో భారత టీ20 లీగ్ కీలక పాత్ర పోషించిందని, అదేవిధంగా టీమ్ఇండియా ఆటగాళ్లనూ ఇతర దేశాల్లో లీగ్లు ఆడేందుకు అనుమతిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో కౌంటీలకు ఆడినప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్కు చాలా ప్రయోజనం చేకూరేదని డిసిల్వా పేర్కొన్నాడు.
ఇటీవల భారత టీ20 లీగ్ మీడియా హక్కుల కోసం జరిగిన బిడ్లో భారీ మొత్తం వెచ్చించి మరీ సంస్థలు కొనుగోలు చేశాయి. దాదాపు 6.2 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. ఒక్కో మ్యాచ్కు దాదాపు 15 మిలియన్ డాలర్లను బీసీసీఐ దక్కించుకుంది. సంపద సృష్టిస్తున్న ఇటువంటి లీగ్లో చిన్న దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలని అరవింద డిసిల్వా సూచించాడు. అప్పుడే ఆ దేశాల్లో మెరుగైన క్రికెట్ నైపుణ్యాలు వెలికి తీసే అవకాశం ఉంటుందని విశ్లేషించాడు.
‘‘క్రికెట్లో డామినేటింగ్ దేశం (భారత్) టీ20 లీగ్లలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే.. తమ దేశ క్రికెటర్లను విదేశీ టోర్నీల్లో ఆడించడానికి అనుమతించడం లేదు. దీని వల్ల ప్రమాణాలు పడిపోతూ ఉంటే ఏదొక సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే క్రికెట్ వృద్ధి కోసం టీ20 లీగ్లపై భారత్ పట్టు సడలించాలి. చిన్న దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ చర్యలు తీసుకోవాలి. లేకపోతే జింబాబ్వే, దక్షిణాఫ్రికా మాదిరిగా మా జట్టులో కూడా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది’’ అని అరవింద డిసిల్వా ఆందోళన వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!