Asia Cup : అఫ్గాన్ గెలవాలి.. టీమ్ఇండియా ఆశలు నిలవాలి!
టీమ్ఇండియా క్రికెట్ అభిమానుల నోట ఓ రెండు జట్ల పేర్లు మారుమోగడం ఖాయం. అందులో ఒకటి అఫ్గానిస్థాన్.. మరొకటి పాకిస్థాన్.. ఎందుకంటారా..? ఆసియా కప్ ఫైనల్కు భారత్ వెళ్లాలంటే...
ఆసియా కప్ సూపర్-4లో ఇవాళ పాక్తో అఫ్గాన్ మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా క్రికెట్ అభిమానుల నోట ఓ రెండు జట్ల పేర్లు మారుమోగడం ఖాయం. అందులో ఒకటి అఫ్గానిస్థాన్.. మరొకటి పాకిస్థాన్.. ఎందుకంటారా..? ఆసియా కప్ ఫైనల్కు భారత్ వెళ్లాలంటే ఈ టీమ్లు ఆడే మ్యాచ్లు చాలా కీలకం. ఇవాళ పాకిస్థాన్తో అఫ్గాన్ తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. అలాకాకుండా అఫ్గాన్ గెలిస్తే భారత్కు అవకాశాలు సజీవంగా ఉంటాయి. అప్పుడు గురువారం అఫ్గాన్ మీద టీమ్ఇండియా విజయం సాధిస్తే రేసులో నిలుస్తుంది. ఇక పాకిస్థాన్ కూడా తన చివరి మ్యాచ్లో లంకపైనా ఓడాల్సి ఉంటుంది. అప్పుడు నెట్రన్రేట్ మెరుగ్గా ఉన్న టీమ్ ఫైనల్కు చేరుకుంటుంది. మిగిలిన జట్లు ఇంటిముఖం పడతాయి.
ఇరు జట్లు పోటాపోటీగానే..
ఇవాళ పాక్, అఫ్గాన్ మ్యాచ్ ఫలితంపై భారత్ భవితవ్యం ఆధారపడి ఉంది. టీ20 క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒకే ఒక ఓవర్లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. అలాంటి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్ జట్టు ఉత్తమ ప్రదర్శనే ఇస్తోంది. ఆసియా కప్లో వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గి సూపర్-4కి చేరుకుంది. అయితే లంకపై చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో పాక్తో సమరానికి సిద్ధమైంది. అఫ్గాన్ టీమ్లో జజాయ్, గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, నబీ, రషీద్ ఖాన్, నజీబుల్లా, ముజీబ్ వంటి టాప్ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో రషీద్ ఖాన్, ముజీబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అఫ్గాన్తో పోలిస్తే పాక్ జట్టే బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. బాబర్ అజామ్, రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, నవాజ్, ఫకర్ జమాన్ వంటి బ్యాటర్లు ఆ జట్లు సొంతం. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, నవాజ్ బౌలింగ్లో మెరుస్తున్నారు.
అఫ్గాన్ మీద మనం గెలిస్తేనే..
ఒక వేళ ఇవాళ అఫ్గాన్ మీద పాక్ ఓడితే మాత్రం భారత్కు ఛాన్స్ దక్కినట్లే. దానిని సద్వినియోగం చేసుకోవాలంటే అఫ్గాన్ మీద టీమ్ఇండియా భారీ విజయం సాధించాలి. అయితే ఎప్పుడైనా సరే టాస్ కీలకంగా మారుతుంది. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గితేనే భారీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అప్పుడు నెట్రన్రేట్ పెరుగుతుంది. శ్రీలంకపైనా పాక్ ఓడితే నెట్రన్రేట్ కీలకమవుతుంది. ఇది జరగాలంటే భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 200కిపైగా పరుగులు సాధించాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చారు. అయితే కేఎల్ రాహుల్, రిషభ్, సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా కీలక సమయంలో ఔటై నిరాశపరిచారు. ఇక బౌలింగ్లోనూ కట్టడి చేయాలి. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నా.. దానిని కొనసాగించడంలో విఫలం కావడంతో ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, హార్దిక్ డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులను సంధించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు