ప్చ్..! టీమ్ఇండియా ర్యాంకు 4
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమ్ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది....
2-1 లేదా 3-1తో గెలవకపోతే ఫైనల్ కష్టం
దుబాయ్: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమ్ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది. ఛాంపియన్షిప్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్ ఆడే సంగతి తెలిసిందే.
చెపాక్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 420 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 192 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 72 పరుగులు చేయడమే ఊరట. తొలి రెండు రోజులు అత్యంత ఫ్లాట్గా ఉన్న పిచ్ ఆఖరి రోజు విపరీతంగా టర్న్ అయింది. దీనిని ఇంగ్లాండ్ అనుకూలంగా మలుచుకుంది.
న్యూజిలాండ్ జట్టు 70శాతం విజయాల రేటుతో ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. మరో స్థానం కోసం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి. ప్రస్తుత సిరీసులో 3-1, 3-0 లేదా 4-0తో గెలిస్తే ఇంగ్లాండ్ ఫైనల్ చేరుకుంటుంది. ఆసీస్పై విజయంతో అగ్రస్థానానికి చేరుకున్న టీమ్ఇండియా ఇప్పుడు 68.3 శాతం విజయాలతో నాలుగో స్థానానికి వచ్చింది. కోహ్లీసేన ఫైనల్ చేరుకోవాలంటే మాత్రం 2-1 లేదా 3-1తో సిరీస్ను గెలవాల్సిందే.
ఒకవేళ భారత్ × ఇంగ్లాండ్ సిరీసు డ్రా అయితే లేదా ఇంగ్లాండ్ 1-0, 2-1, 2-0తో గెలిస్తే ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంటుందని ఐసీసీ తెలిపింది. ఇక దక్షిణాఫ్రికాపై 2-0తో గెలిచిన పాకిస్థాన్ 43.3% విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. సఫారీ జట్టు 30 శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. విండీస్ 23.8 శాతంతో ఏడు, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
ఇవీ చదవండి
చెన్నె టెస్టు: భారత్ ఘోర ఓటమి..
అందుకే సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?