గబ్బా టెస్టు: బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌

గబ్బా టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌ బరిలోకి దిగారు. అంతకుముందు ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది...

Published : 16 Jan 2021 08:38 IST

బ్రిస్బేన్‌: గబ్బా టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. రోహిత్‌ శర్మ(4*), శుభ్‌మన్‌గిల్‌(7*) బరిలోకి దిగి బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. టిమ్‌పైన్‌(50) అర్ధశతకం సాధించాడు. శనివారం 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 5 ఓవర్లకు జట్టు స్కోర్‌ 11/0గా నమోదైంది.

ఇవీ చదవండి..
శతకం చేశాక సెలబ్రేట్‌ చేసుకోను: లబుషేన్‌
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని