చెన్నై టెస్టు: టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 337
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. 257/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం నాలుగో...
రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. 257/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు వాషింగ్టన్ సుందర్ (85*; 138 బంతుల్లో 12x4, 2x6), రవిచంద్రన్ అశ్విన్(31; 91 బంతుల్లో 3x4, 1x6) ఏడో వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు ఉదయం చక్కగా ఆడుతున్న వీరిని జాక్ లీచ్ దెబ్బ కొట్టాడు. అతడు బంతి అందుకొని స్వల్ప వ్యవధిలో అశ్విన్, నదీమ్(0)లను ఔట్ చేశాడు. ఆపై అండర్సన్.. ఇషాంత్(4), బుమ్రా(0)ను ఔట్ చేయడంతో భారత్ 95.5 ఓవర్లలో ఆలౌటైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు తీయగా.. అండర్సన్, ఆర్చర్, లీచ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 241 పరుగుల వెనుకంజలో నిలిచింది.
అయితే, టీమ్ఇండియాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం దక్కినా ఇంగ్లాండ్ వదులుకుంది. తిరిగి ఆ జట్టే రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లీ బంతిని నేరుగా అశ్విన్కు అందివ్వడంతో తొలి బంతికే వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీబర్న్స్ స్లిప్లో రహానె చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో పరుగుల ఖాతా తెరవకముందే ఒక వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో భోజన విరామ సమయానికి పర్యాటక జట్టు 2 ఓవర్లకు 1/1తో నిలిచింది. క్రీజులో సిబ్లీ, లారెన్స్ ఉన్నారు.
ఇవీ చదవండి..
ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ ముందడుగు
అది దురదృష్టం.. ఏమీ చేయలేను: పుజారా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)