Ban vs Ind: మూడో వన్డేలో గెలవడం టీమ్ఇండియాకు చాలా ముఖ్యం: గావస్కర్
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ని చేజార్చుకుంది. డిసెంబర్ 10న నామమాత్రపు మూడో వన్డే జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ని చేజార్చుకుంది. డిసెంబర్ 10న నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు సిరీస్కు ముందు జరిగే మూడో వన్డేలో గెలవడం టీమ్ఇండియాకు చాలా ముఖ్యమని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ‘వారు (టీమ్ఇండియా) తమ బలమైన జట్టును ఎంచుకోవాలి. త్వరలో జరిగే టెస్టు సిరీస్కు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడానికి ఈ మ్యాచ్ను ఉపయోగించుకోవాలి. టెస్టులు, వన్డేలకు జట్టు కూర్పు కాస్త భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ పటిష్టంగా ఉంది. మూడో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్ ఓటమి తేడాను 2-1కి తగ్గించాలి. ఈ వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని తర్వాత జరిగే టెస్ట్ సిరీస్లో గెలుపొందడానికి ప్రయత్నించండి’ అని గావస్కర్ సూచించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే బోర్డర్, గావస్కర్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో అవకాశం దక్కాలంటే భారత్ తన మిగిలిన 6 టెస్టుల్లో ఐదు తప్పక గెలవాలి. ‘బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను గెలిస్తే భారత్కు లాభదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా నాలుగు టెస్టులు ఆడనుంది. బంగ్లాతో ఈ రెండు టెస్టులు గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించేందుకు దోహదపడతాయి’ అని సునీల్ గావస్కర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ