KL Rahul : గొప్ప మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. బాలుడి శస్త్ర చికిత్స కోసం ఆర్థిక సాయం.!
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ బాలుడి శస్త్ర చికిత్స కోసం సాయం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల వరద్ నల్వాడే అనే బాలుడు అరుదైన..
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ బాలుడి శస్త్ర చికిత్స కోసం సాయం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల వరద్ నల్వాడే అనే బాలుడు అరుదైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. గతేడాది సెప్టెంబరు నుంచి ముంబయిలోని జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వరద్ తల్లిదండ్రులు ఎముకలోని మజ్జా మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్)కి శస్త్ర చికిత్స చేయించే ఖర్చులను భరించే స్థోమత లేకపోవడంతో.. ‘గివ్ ఇండియా’అనే స్వచ్చంద సంస్థను సాయం కోరారు. వరద్ తండ్రి సచిన్ నల్వాడే ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగా, తల్లి స్వప్న నల్వాడే గృహిణి. గివ్ ఇండియా ద్వారా విషయం తెలుసుకున్న కేఎల్ రాహుల్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శస్త్ర చికిత్సకు అవసరమైన రూ.31 లక్షలు విరాళంగా అందజేశాడు.
(Photo : Give India Twitter)
‘వరద్ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే.. నా టీమ్ గివ్ ఇండియాను సంప్రదించింది. చికిత్సకు అవసరమైన సాయం అందజేస్తామని చెప్పాం. ప్రస్తుతం శస్త్ర చికిత్స విజయవంతమై అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే వరద్ పూర్తిగా కోలుకుని.. తన కలలను సాకారం చేసుకుంటాడనుకుంటున్నాను. నేను చేసిన ఈ చిరుసాయం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మరికొంత మంది ముందుకొస్తారనుకుంటున్నాను’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
‘నా కుమారుడి శస్త్ర చికిత్స కోసం సాయమందించిన కేఎల్ రాహుల్కి ధన్యవాదాలు. రాహుల్ ముందుకు రాకపోయుంటే ఇంత తక్కువ సమయంలో ఈ శస్త్ర చికిత్స సాధ్యమయ్యేది కాదు’ అని వరద్ తల్లి స్వప్న నల్వాడే చెప్పారు. ‘కేఎల్ రాహుల్ ఉదారతకు ధన్యవాదాలు. తన దాతృత్వంతో వరద్కి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. రాహుల్ లాంటి ఒక గొప్ప క్రికెటర్ ముందుకు వచ్చి సాయం చేయడం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంది. దీంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు మరికొంత మంది ముందుకొస్తారనుకుంటున్నాను’ అని గివ్ ఇండియా సీవోవో సుమిత్ తయాల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు