Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తన కెరీర్లో ఎన్నో అపురూపు ఇన్నింగ్స్లు ఆడి జట్టుకు విజయాలనందించాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి అతడు సిద్ధమవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2018-19 ఆస్ట్రేలియా పర్యటన (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన, అత్యుత్తమ సిరీస్ అని భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. భారత టాప్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా ఉన్న పుజారా ఆస్ట్రేలియాలో జరిగిన 2018-19 మధ్య జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. మొత్తం 521 పరుగులు చేసి నాలుగు టెస్టుల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
‘నేను కొన్ని మంచి సిరీస్లను ఆస్వాదించాను. కానీ, నా క్రికెట్ కెరీర్లో 2018-19 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అత్యుత్తమ సిరీస్. అప్పుడు నేను బ్యాటింగ్ చేసిన విధానం, ఏకాగ్రత బాగుంది. ఆ సిరీస్లో శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడి ఉండేది. ప్రతి మ్యాచ్ ఒక సవాలుగా ఉండేది’ అని పుజారా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం అన్ని పరిస్థితుల్లో బాగా ఆడుతోంది. మరికొన్ని రోజుల్లో ఆసీస్, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పుజారా మాట్లాడుతూ.. రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని, ఇలా రసవత్తర పోరు ఉండటం తనకి ఇష్టమని పేర్కొన్నాడు.
‘ఆస్ట్రేలియాతో మంచి పోటీ ఉంటుంది. వారు మాకు సవాలు విసురుతారు. ఇలాంటి రసవత్తరపోరు నేను ఇష్టపడతాను. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్రికెట్ యుద్ధం. ఆస్ట్రేలియా పోరాడే జట్టు. టీమ్ ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆటగాడిగా జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. నేను ఎన్నో ముఖ్యమైన ఇన్నింగ్స్లు ఆడాను. వాటిలో చాలా వరకు ఆస్ట్రేలియాపై సాధించినవే’ అని పుజారా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్