విహారి, అశ్విన్ కాపాడారు..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా చివరికి 334/5 స్కోర్ సాధించింది...
ఆసీస్ విజయానికి అడ్డుకట్ట వేశారు..
తృటిలో శతకం చేజార్చుకున్న పంత్..
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా చివరికి 334/5 స్కోర్ సాధించింది. హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4), రవిచంద్రన్ అశ్విన్(39*; 128 బంతుల్లో 7x4) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. సోమవారం 98/2 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 3 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
ఆశలు రేకెత్తించిన పంత్, పుజారా..
చివరి రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ అజింక్య రహానె(4) విఫలమయ్యాడు. దీంతో భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన పుజారా(77; 205 బంతుల్లో 12x4), పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6) తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవైపు పంత్ ధాటిగా ఆడగా, మరోవైపు పుజారా డిఫెన్స్ చేశాడు. అలా వీరిద్దరూ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి జట్టు స్కోర్ను 70 ఓవర్లలో 206/3కి తీసుకెళ్లారు. దీంతో భారత్ విజయంపై ఆశలు రేకెత్తాయి. అయితే, రెండో సెషన్లో పంత్ శతకానికి చేరువైన వేళ లైయన్ బౌలింగ్లో ఔటయ్యాడు. స్క్వేర్లెగ్ మీదుగా షాట్ ఆడడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కమిన్స్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోర్ 250/4గా నమోదైంది.
సహనానికి పరీక్ష..
అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోర్ 272 పరుగుల వద్ద హేజిల్వుడ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విహారి, అశ్విన్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను 280/5తో ముగించారు. ఇక చివరి సెషన్లో మరింత రక్షణాత్మకంగా ఆడిన వారిద్దరూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చివరి వరకు క్రీజులో పాతుకుపోయారు. భారత్ను ఓటమి నుంచి తప్పించాలనే పట్టుదలతో కనిపించారు. దాంతో ఆసీస్ విజయానికి అడ్డుకట్ట వేశారు. చివరికి వారిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆస్ట్రేలియా శనివారం 312/6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆ జట్టుకు 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
స్కోర్ బోర్డు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338 ఆలౌట్; స్మిత్ 131, లబుషేన్ 91; జడేజా 4 వికెట్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 244 ఆలౌట్; పుజారా 50, గిల్ 50; కమిన్స్ 4 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్; గ్రీన్ 84, స్మిత్ 81; సైని 2 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్: 334/5; పంత్ 97, పుజారా 77; హేజిల్వుడ్ 2 వికెట్లు
ఇవీ చదవండి..
షోయబ్ మాలిక్కు తప్పిన ప్రమాదం
క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!