సీన్ రిపీట్: ఇంగ్లాండ్దే పైచేయి
చెపాక్ టెస్టులో తొలి రోజు సీనే రెండో రోజూ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. సిబ్లీ (87) పాత్రని ...
ఇంటర్నెట్డెస్క్: చెపాక్ టెస్టులో తొలి రోజు సీనే రెండో రోజూ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. సిబ్లీ (87) పాత్రని బెన్ స్టోక్స్ (82; 118 బంతుల్లో, 10×4, 3×6) పూర్తిచేశాడు. అయితే ఆఖరి సెషన్లో భారత బౌలర్లు పుంజుకున్నా అంతిమంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది.
263/3 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ శనివారం ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోరు సాధించింది. జో రూట్, బెన్ స్టోక్స్ నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం (124) నెలకొల్పారు. క్రీజులో బెస్ (28; 84 బంతుల్లో, 5×4), లీచ్ (6; 28 బంతుల్లో, 1×4) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, నదీమ్ ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ఇంకా డిక్లేర్ చేయలేదు.
రెండో రోజు ఆటను ప్రారంభించిన రూట్, స్టోక్స్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రూట్ సాధికారికంగా బ్యాటింగ్ చేయగా, స్టోక్స్ కాస్త దూకుడుగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 73 బంతుల్లో అర్ధశతకం, రూట్ 260 బంతుల్లో 150 పరుగులు అందుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా తొలి సెషన్ను 355/3 స్కోరుతో ముగించింది. అయితే నదీమ్ స్టోక్స్ను ఔట్ చేయడంతో వీరిద్దరి శతక భాగస్వామ్యానికి తెరపడింది.
రూట్ డబుల్ ధమాకా
తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్ (34; 89 బంతుల్లో, 3×4)తో కలిసి రూట్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఫ్లిక్ షాట్లు, డ్రైవ్లు, స్వీప్షాట్లతో పరుగులు చేశాడు. అశ్విన్ బౌలింగ్లో సిక్సర్తో అతడు డబుల్ సెంచరీని సాధించడం విశేషం. తన కెరీర్లో ఇది అయిదో ద్విశతకం కాగా గత మూడు టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ. మరోవైపు పోప్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ టీ విరామానికి 454/4 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
ఆఖరి సెషన్ భారత్దే
చివరి సెషన్లో భారత బౌలర్లు చెలరేగారు. పోప్ను అశ్విన్ ఔట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే రూట్ను నదీమ్ బోల్తాకొట్టించాడు. అయితే బట్లర్ (30; 51 బంతుల్లో, 5×4) వికెట్ల పతనానికి బ్రేక్లు వేశాడు. బెస్తో కలిసి ఏడో వికెట్కు 48 పరుగులు సాధించాడు. కానీ, ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో బట్లర్, ఆర్చర్ (0)ను ఔట్ చేశాడు. భారత బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లాండ్ ఆలౌట్ అవుతుందని భావించారంతా. కానీ బెస్, లీచ్ పట్టుదలతో క్రీజులో నిలిచారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు