చెపాక్లో ‘రూట్’ వేశాడు!
చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్దే పైచేయి. సారథి జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన...
తొలి రోజు ఇంగ్లాండ్దే పైచేయి
ఇంటర్నెట్డెస్క్: చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. సారథి జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన సూపర్ఫామ్ను కొనసాగిస్తూ శతకంతో సత్తాచాటాడు. ఓపెనర్ సిబ్లీ (87; 286 బంతుల్లో, 12×4) కూడా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 263/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో టీమిండియా మూడో వికెట్ సాధించింది.
65 పరుగులకే రెండు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు బర్న్స్ (33; 60 బంతుల్లో, 2×4), సిబ్లీ మొదటి వికెట్కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ రవిచంద్రన్ అశ్విన్ బర్న్స్ను బోల్తాకొట్టించడంతో 63 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన లారెన్స్ను బుమ్రా ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
తొలుత నిదానంగా.. తర్వాత దూకుడుగా
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రూట్.. సిబ్లీతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత వీరిద్దరు వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అందివచ్చినప్పుడల్లా బౌండరీలు బాదారు. సిబ్లీ అర్ధశతకం సాధించడంతో టీ విరామానికి ఇంగ్లాండ్ 140/2తో నిలిచింది. అనంతరం రూట్ గేర్ మార్చాడు. బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. స్వీప్షాట్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో శతకం అందుకున్నాడు. తన కెరీర్లో రూట్కు ఇది 100వ టెస్టు.
మరోవైపు రూట్కు సిబ్లీ చక్కని సహకారం అందించాడు. డిఫెండ్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ పరుగులు సాధించాడు. రూట్తో కలిసి మూడో వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే తొలి రోజు ఆటలో భారత్కు రెండే వికెట్లు దక్కాయని అందరూ భావిస్తున్న తరుణంలో బుమ్రా మాయ చేశాడు. ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న అతడు అద్భుతమైన యార్కర్తో సిబ్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఔట్ అనే తేలింది. దీంతో ఇంగ్లాండ్ తొలి రోజు ఆటలో 89.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. టెస్టుపై భారత్ పట్టుబిగించాలంటే రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ను వీలైనంత తక్కువ స్కోరుకు కట్డడి చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే