India vs Netherlands: టాస్ పడకుండానే భారత్- నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
టీమ్ఇండియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్కు టాస్ పడకుండానే రద్దయింది.
తిరువనంతపురం: ప్రపంచకప్ ముంగిట నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం అంతరాయం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్.. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి. నేడు టీమ్ఇండియా, నెదర్లాండ్స్ మధ్య వార్మప్ మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో టీమ్ఇండియా ఆడాల్సిన రెండు సన్నాహక మ్యాచ్లు వర్షార్పణం అయినట్లయింది. ఇవాళ్టితో వార్మప్ మ్యాచ్లు ముగుస్తాయి. అక్టోబర్ 5న (అహ్మదాబాద్) ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో ప్రధాన మ్యాచ్లు మొదలవుతాయి. భారత్ తన మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
టీ20ల్లో బిష్ణోయ్ నంబర్వన్
భారత యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్వన్ బౌలర్గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్. -
టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. -
గిల్ 400 చేయగలడు
క్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ బద్దలు కొడతాడని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. -
దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
సొంతగడ్డపై టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. -
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్రౌండర్ల కొరత
అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్ వల్లే నాణ్యమైన ఆల్రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్. చరిత్రలోనూ ఆల్రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. -
ఒక్క రోజే 15 వికెట్లు
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. -
వోజ్నియాకికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్కార్డ్
మహిళల మాజీ నంబర్వన్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్)కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్లో వైల్డ్కార్డ్ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్కార్డులు ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు