IND vs NZ: రేపటి నుంచే టీ20 సమరం.. పొట్టి సిరీస్లోనూ భారత్ జోరు కొనసాగిస్తుందా?
భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జనవరి 27 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టీ20 రాంచీలో జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్పై మూడు వన్డేల సిరీస్ని 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్పై కన్నేసింది. రేపటి నుంచే (జనవరి 27) మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్లో ఆడిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరంగా ఉన్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. వరుసగా సెంచరీలు బాది భీకరమైన ఫామ్లో ఉన్నశుభ్మన్ గిల్, రంజీల్లో ట్రిపుల్ సెంచరీ బాది జోరుమీదున్న పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. ఇక, కివీస్పై వన్డే సిరీస్లో నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు పొట్టి సిరీస్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్య.. టీ20ల్లో అదే ఆటతీరును కొనసాగించాల్సిన అవసరముంది. మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ ఉండగా.. వీరిలో ఇద్దరికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కే అవకాశం ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్కు తుదిజట్టులో చోటు ఖాయం. శివమ్ మావి, ముఖేశ్ కుమార్లలో ఒకరిని మూడో పేసర్గా తీసుకోవచ్చు. స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, చాహల్ మధ్య పోటీ ఉండగా.. నిలకడగా వికెట్లు పడగొడుతున్న కుల్దీప్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపొచ్చు.
ఏ మ్యాచ్ ఎప్పుడు?
- తొలి టీ20 రాంచీ - జనవరి 27న రాత్రి 7.గంటలకు
- రెండో టీ20 లఖ్నవూ - జనవరి 29న రాత్రి 7.గంటలకు
- మూడో టీ20 అహ్మదాబాద్ - ఫిబ్రవరి 01న రాత్రి 7.గంటలకు
గత రికార్డులు ఇలా..
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. 12 మ్యాచ్ల్లో టీమ్ఇండియా విజయం సాధించగగా.. కివీస్ 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.
భారత జట్టు:(అంచనా)
శుభ్మన్ గిల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు: (అంచనా)
మిచెల్ శాంటర్న్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్వెల్, డేవాన్ కాన్వే, జాకబ్, ఫెర్గూసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), హెన్రీ షిప్లే, ఇష్ సోధి, టిక్నర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో