INDvsNZ: కివీస్ను తక్కువ అంచనా వేయొద్దు..
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో భారత్.. కివీస్తో మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది...
ఐసీసీ ట్రోఫీల్లో భారత్కు షాకిచ్చిన న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో భారత్.. కివీస్ మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడాల్సి రావడంతో కోహ్లీసేన ఈసారి ఎలా ఆడనుందనే విషయం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పలుమార్లు భారత్కు షాకివ్వడం కూడా ఇప్పుడు కొత్తగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఎప్పుడెప్పుడు ఆ జట్టుతో ఓటమిపాలైందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
దాదా శతకం వృథా..
2000 ఏడాది ఐసీసీ నాకౌట్ సిరీస్లో టీమ్ఇండియాకు న్యూజిలాండ్ తొలిసారి షాకిచ్చింది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని జట్టును స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమ్ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ తొలివికెట్కు 26.3 ఓవర్లలో 141 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే సమయంలో సచిన్ వెనుదిరగ్గా ఆపై వచ్చిన రాహుల్ ద్రవిడ్ (22), యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్సింగ్ (13), అజిత్ అగార్కర్ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దాంతో చివరికి టీమ్ఇండియా 50 ఓవర్లలో 264/6తో సరిపెట్టుకుంది. ఛేదనలో కివీస్ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. క్రిస్కేర్న్స్ (102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో చెలరేగాడు. అతడికి క్రిస్ హారిస్ (46; 72 బంతుల్లో 4x4) చక్కటి సహకారం అందించాడు. దాంతో న్యూజిలాండ్ రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్..
ఇక 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-2లో పదమూడో మ్యాచ్లో తలపడ్డాయి. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దాంతో భారత్ సునాయాస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ధోనీసేన ఛేదనలో మరింత దారుణంగా ఆడి టీ20ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లు అశ్విన్, నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా కట్టుదిట్టంగా బంతులేసి తలా ఓ వికెట్ తీసి కివీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. ఆ జట్టులో కొరే అండర్సన్ (34; 42 బంతుల్లో 3x4), లూక్ రోంచి (21; 11 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ (23; 27 బంతుల్లో 2x4), ధోనీ (30; 30 బంతుల్లో 1x4, 1x6) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో చివరికి 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ శాంట్నర్ 4/11 కెరీర్లో గొప్ప గణాంకాలు నమోదు చేశాడు.
ధోనీ రనౌటై.. నిరాశపర్చాడు..
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులే చేసింది. రాస్టేలర్ (74; 90 బంతుల్లో 3x4, 1x6), కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్ అందించారు. కానీ, ఆరోజు వర్షం కురవడంతో ఆట మరుసటి రోజుకు వాయిదా పడింది. ఛేదనలో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులేత్తేసింది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), కోహ్లీ (1) దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యారు. మధ్యలో పంత్ (32), హార్దిక్ పాండ్య (32) ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. కానీ, రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) అద్భుతంగా ఆడి మ్యాచ్పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చివర్లో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోగా స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ముఖ్యంగా ధోనీ అర్ధశతకం పూర్తయ్యాక రనౌట్ అవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది.
రెండు టెస్టుల్లో ఓటమే..
మరోవైపు గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోనూ టీమ్ఇండియా ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో విలియమ్సన్ జట్టుతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించిన భారత్.. కివీస్తో మాత్రం గెలవలేకపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎప్పుడూ భారత్కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో తటస్థ వేదికగా జరుగుతుండడంతో మ్యాచ్పై ఆసక్తి పెరుగుతోంది. కానీ, ఆ ఫైనల్కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడటం వల్ల ఆ జట్టుకు కలిసివస్తుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు