IND vs NZ: కివీస్తో మ్యాచ్.. పొంచి ఉన్న వర్షం ముప్పు..?
భారత్-కివీస్ మ్యాచ్కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, టీమ్ఇండియా మధ్యన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ శుక్రవారం జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్న భారత జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాడు. ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది.
వెల్లింగ్టన్ వాతావరణ పరిస్థతుల ప్రకారం ఈరోజు వర్షం వచ్చే అవకాశాలు దాదాపు 81 శాతం ఉన్నాయి. అయితే, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కాస్త తేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ వర్షం ముప్పు 49 శాతం ఉందన్నారు. ఈ కారణంగా ఇరు జట్లు తమ ప్రణాళికలను మార్చుకుంటాయా.. తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!