IND vs SA: గెలుపు ధీమాతో టీమ్ఇండియా.. ఇక సఫారీతో సై..
ఆసీస్పై సిరీస్ గెలుపుతో ఆత్మవిశ్వాసంతో టీమ్ఇండియా సఫారీతో పోరుకు సిద్ధమైంది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది..........
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో ఫైనల్కు చేరకుండానే వెనుదిరిగిన టీమ్ఇండియా.. ఆపై పుంజుకుంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సిరీస్ను సొంతం చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్కు సిద్ధమైంది. అయితే ఆసీస్పై సిరీస్ గెలిచినప్పటికీ.. భారత జట్టులోని పలు లోపాలు తేటతెల్లమయ్యాయి. అందుకే ప్రపంచకప్కి ముంగిట సఫారీ జట్టుతో జరగబోయే ఈ పోరు ఎంతో కీలకం కానుంది. ప్రపంచకప్లో పైచేయి సాధించాలంటే.. జట్టులోని లోపాలను సరిచేసుకొనేందుకు ఈ సిరీస్ ఓ సువర్ణావకాశం. లేదంటే తర్వాత జరిగే మెగా టోర్నీలో బొక్కబోర్లా పడటం ఖాయం.
బలమైన బ్యాటింగ్ లైనప్
భారత జట్టు అతితక్కువ స్కోరుకే ఔటవడం ఈ మధ్య కాలంలో ఏనాడూ జరగలేదు. అందుకు కారణం బలమైన బ్యాటింగ్ లైనప్. ఒకరు విఫలమైనా.. మరొకరు రాణించి ప్రత్యర్థి ముందు మంచి స్కోర్లనే ఉంచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లాంటి నైపుణ్యం గల బ్యాటర్లు జట్టు సొంతం. కొద్దికాలంగా రన్స్ చేసేందుకు ఇబ్బంది పడిన కోహ్లీ మళ్లీ ఫామ్ను అందుకొని పరుగుల వేటను ప్రారంభించాడు. ఆసియా కప్లో సెంచరీ, ఆపై ఆసీస్తో నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో అర్ధ శతకంతో రాణించాడు. ఇక సూర్య కుమార్ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సఫారీతో సిరీస్తోపాటు వరల్డ్కప్లోనూ మెరుపులు కొనసాగాలని జట్టు మొత్తం ఆశిస్తోంది.
ఇదే పెద్ద సమస్య
ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచుతున్నప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోవడమే ఇప్పుడు జట్టు ముందున్న అతిపెద్ద సమస్య. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పవర్ ప్లేలో ఉత్తమంగానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. తర్వాత తేలిపోతున్నారు. గతంలో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా పేరుగాంచిన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.. ఇప్పుడు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రపంచకప్కి ముందు వారు ఈ సమస్యను అధిగమించేందుకు ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు తిరిగి తమ లయను అందుకోవాలని జట్టుతోపాటు అభిమానులు కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన బుమ్రా సైతం కట్టడిగా బౌలింగ్ చేస్తే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ఖాయం.
నేనున్నానంటూ అక్షర్
గాయం కారణంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కావడంతో శిబిరంలో ఆందోళన నెలకొనగా.. అతడి స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ నేనున్నానంటూ జట్టుకు ధైర్యాన్నిచ్చాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అక్షర్ సిరీస్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. బ్యాటింగ్లో అవకాశం రాకపోయినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సైతం దక్కించుకున్నాడు. దీంతో జడేజా స్థానాన్ని పరిపూర్ణంగా భర్తీ చేస్తాననే ధీమా ఇచ్చాడు. ఈ సిరీస్కు మరో ఆల్రౌండర్ హార్దిక్ దూరం కానుండటంతో అక్షర్ పాత్ర మరింత కీలకం కానుంది. వీరితోపాటు డీకే, అశ్విన్, చాహల్ తమ శక్తిమేర రాణించాల్సిన అవసరం ఉంది.
భారత్దే పైచేయి
భారత్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ల్లో భారత్దే పైచేయి. ఈ రెండు జట్లు మొత్తంగా 20 సార్లు పోటీ పడగా.. టీమ్ఇండియా 11 సార్లు గెలుపొందింది. సఫారీ జట్టు 8 సార్లు విజయం సాధించగా.. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఉన్న ఆ జట్టులోనూ స్టార్లకు కొదువలేదు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న మార్క్రమ్తోపాటు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ లాంటి స్టార్ బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. కాగా భారత బౌలర్లు వీరిని కట్టడిచేయాల్సిన అవసరం ఉంది. ఎంగిడి, ఎన్రిచ్ నోకియా, రబాడా, తబ్రిజ్ షంసి లాంటి ఉత్తమ బౌలర్లు సైతం ఆ జట్టు సొంతం. వీరిని సమర్థంగా ఎదుర్కొంటే ఈ సిరీస్లో భారత్కు తిరుగుండదనేది విశ్లేషకుల మాట.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా జట్టు
తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, నోకియా, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, కగిసో రబాడా, రిలీ రోసో, తబ్రిజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్