IND vs SL: విజృంభించిన భారత బౌలర్లు.. తొలి రోజు ఆటపూర్తి
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి మొదటి ఇన్నింగ్స్లో శ్రీలంక 86/6తో నిలిచింది. నిరోషన్ డిక్వెల్లా (13*), ఎంబుల్దేనియా (0*) నాటౌట్గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లంక ఇంకా 166 పరుగుల
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి మొదటి ఇన్నింగ్స్లో శ్రీలంక 86/6తో నిలిచింది. నిరోషన్ డిక్వెల్లా (13*), ఎంబుల్దేనియా (0*) నాటౌట్గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లంక ఇంకా 166 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, మహ్మద్ షమి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (92; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ (39; 26 బంతుల్లో 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా మూడు, జయవిక్రమ మూడు, ధనంజయ రెండు, లక్మల్ ఒక వికెట్ పడగొట్టారు.
భారత ఆటగాళ్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన లంకేయులు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ బాటపట్టారు. బుమ్రా వేసిన మూడో ఓవర్లోనే లంకకు ఎదరుదెబ్బ తగిలింది. కుశాల్ మెండిస్ (2) శ్రేయస్ అయ్యర్కి చిక్కాడు. దీంతో శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి తిరుమానె (8) ఔటయ్యాడు. షమి వేసిన తర్వాతి ఓవర్లో కరుణరత్నే (4) క్లీన్బౌల్డ్ అయ్యాడు. అప్పటికి లంక స్కోరు 14/3. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్, ధనంజయ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. కుదురుకుంటున్న ఈ జోడీని షమి వీడదీశాడు. ధనంజయ డిసిల్వ (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడిని అక్షర్ పటేల్ వెనక్కిపంపాడు. దీంతో లంక 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డిక్వెల్లాతో కలిసి ఇన్నింగ్స్ని గాడిలో పెట్టాలనుకున్న మాథ్యూస్ (43).. బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు చిక్కాడు.
* శ్రేయస్ అయ్యర్ ఒక్కడే..
అంతకు ముందు, ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (92: 98 బంతుల్లో 10×4, 4×6) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించాడు. లసిత్ ఎంబుల్దెనియా వేసిన 35 ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అయ్యర్.. ఆ తర్వాత ధనంజయ వేసిన 48వ ఓవర్లో రెండు సిక్సులు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ.. శతకం దిశగా సాగాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ జయవిక్రమ వేసిన 59.1 బంతిని భారీ షాట్గా మలిచే క్రమంలో ముందుకు వచ్చిన అయ్యర్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (39: 26 బంతుల్లో 7×4), హనుమ విహారి (31: 81 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (23) మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (15), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4), రవీంద్ర జడేజా (4), రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9), మహమ్మద్ షమి (5) పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి