IND vs SL: సిరాజ్ జోరు.. శ్రీలంకపై భారత్ రికార్డు విజయం..
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.
తిరువనంతపురం: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. ఐర్లాండ్పై 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (275), సౌతాఫ్రికా (272), సౌతాఫ్రికా (258), భారత్ (257) అత్యధిక పరుగులతో ఉన్నాయి. తొలుత భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాటింగ్కి దిగలేదు. శ్రీలంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. నువనిదు ఫెర్నాండో (19) టాప్ స్కోరర్. మహమ్మద్ సిరాజ్ (4/32) శ్రీలంక పతనంలో కీలకపాత్ర పోషించాడు. షమి (2/20), కుల్దీప్ యాదవ్ (2/16) కూడా రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ని టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది.
టపా టపా వికెట్లు..
391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్లో అవిష్క ఫెర్నాండో (1)ని వెనక్కి పంపిన సిరాజ్.. నాలుగో ఓవర్లో కుశాల్ మెండిస్ (4)ని ఔట్ చేశాడు. షమి వేసిన 6.3 ఓవర్కు అసలంక (1) వెనుదిరిగాడు. నువనిదు ఫెర్నాండో (19)ని 7.3 ఓవర్కు క్లీన్బౌల్డ్ చేసిన సిరాజ్.. కొద్ది సేపటికే హసరంగ (1)ని ఔట్ చేసి నాలుగో వికెట్ని ఖాతాలో వేసుకున్నాడు.12వ ఓవర్లో కరుణరత్నె (1)ని అద్భుతంగా రనౌట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్లో చివరి బంతికి డాసున్ శనక (11) క్లీన్బౌల్డ్ అవ్వగా.. షమి వేసిన 15.4 బంతికి వెల్లలగె (3)., సూర్యకుమార్ యాదవ్కి చిక్కాడు. కుల్దీప్ వేసిన 22వ ఓవర్లో చివరి బంతికి లాహిరు కుమార (9) ఔటయ్యాడు.
విరాట్ విశ్వరూపం
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (166; 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. శుబ్మన్ గిల్ (116; 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా శతక్కొట్టాడు. రోహిత్ శర్మ (42), శ్రేయస్ అయ్యర్ (38) రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్ రజిత తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నె ఒక వికెట్ తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం