IND vs SL:టీమ్ఇండియాకు భారీ షాక్‌! శ్రీలంకతో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం

లంకపై టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా (Team India) రేపటి నుంచి (జనవరి 10) ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్‌ తగిలింది.

Updated : 09 Jan 2023 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India)కు భారీ షాక్‌ తగిలింది. రేపటి నుంచి (జనవరి 10) శ్రీలంకతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్  సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్‌ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు చెప్పాయి. బుమ్రా చివరిసారిగా సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లోఆడాడు. అప్పటి నుంచి బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. టీ20 ప్రపంచ కప్‌లోనూ చోటు కోల్పోయాడు. 

శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్‌ సుందర్‌,చాహల్, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని