BCCI: ఆరు కాదు రెండు చోట్లే..వెస్టిండీస్‌తో సిరీస్‌ వేదికల్లో మార్పు

సొంతగడ్డపై వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ).......

Updated : 22 Jan 2022 22:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సొంతగడ్డపై వచ్చే నెలలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. పేటీఎం సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌, విండీస్‌ తలపడనున్నాయి. అయితే, ఈ వేదికల్లో తాజాగా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

ఆరు మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించాలని తొలుత భావించిన బీసీసీఐ.. పలు కారణాలతో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆరు మ్యాచ్‌లను రెండు వేదికలకే పరిమితం చేసింది. ఫిబ్రవరి 6, 9, 11వ తేదీల్లో  జరిగే మూడు వన్డే మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఆ తర్వాత 16, 18, 20వ తేదీల్లో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని