IND vs WI : ఐదో టీ20 మ్యాచ్‌.. విండీస్‌కు భారత్‌ భారీ లక్ష్యం

నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్‌లో విండీస్‌కు భారత్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌...

Updated : 07 Aug 2022 22:13 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్‌) 

ఇంటర్నెట్ డెస్క్‌: నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్‌లో విండీస్‌కు భారత్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో విండీస్‌కు 189 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్ (64) అర్ధశతకం సాధించగా.. దీపక్‌ హుడా (38), హార్దిక్‌ పాండ్య (28) రాణించారు. ఇషాన్‌ కిషన్ 11, సంజూ శాంసన్ 15, దినేశ్‌ కార్తిక్‌ 12, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3.. హేడెన్ వాల్ష్‌, జాసన్ హోల్డర్‌, డొమినిక్‌ డ్రేక్స్ తలో వికెట్ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని