ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి ...
గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం
ఇంటర్నెట్ డెస్క్: కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్ను ఓడించి జింబాబ్వే మంచి ఊపు మీదుంది. ఈ క్రమంలో భారత్, జింబాబ్వే జట్ల బలాలు.. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన సిరీస్లు.. ఆధిక్యం ఎవరనే విషయాలను తెలుసుకుందాం..
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, షమీ, రిషభ్ పంత్ తదితరులు లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. ఈ నెల చివరి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారందరికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో కేఎల్ రాహుల్ - శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా జింబాబ్వేను ఢీకొట్టనుంది. యువ బ్యాటర్లు రుతురాజ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చింది.
జింబాబ్వే.. అంత తేలికేం కాదు
గత జింబాబ్వే జట్టును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ప్రస్తుతం వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న చకబ్వా రెగిస్ నాయకత్వంలోని జింబాబ్వేను తక్కువగా అంచనా వేయొద్దు. మరీ ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ను చిత్తు చేసి వన్డే, టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. సికిందర్ రజా, కెప్టెన్ రెగిస్తోపాటు ఇన్నోసెంట్ కైయా అదరగొట్టేశారు. సెంచరీలతో జింబాబ్వేను గెలిపించారు. 300కిపైగా పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు. ఇక బౌలింగ్లోనూ రజా, మాదెవెరె, బ్రాడ్ ఇవాన్స్ వంటి బౌలర్లు రాణించారు. అందుకే జింబాబ్వేతో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
ఛాన్స్ ఎవరికి వస్తుందో...?
తుది జట్టులో ఎవరు ఉంటారనేది తొలి వన్డే జరిగే హరారే పిచ్ పరిస్థితిని బట్టి కోచ్ లక్ష్మణ్- కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్ణయిస్తారు. అయితే కేఎల్ రాహుల్-శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడతారు. మిడిలార్డర్ కీలకం కాబట్టి సంజూ శాంసన్కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఉంటే ఇటు బ్యాటింగ్తోపాటు బౌలింగ్లో భారత్కు ప్రయోజనంగా ఉంటుంది. రెగ్యులర్ స్పిన్నర్లుగా కుల్దీప్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ముగ్గురు పేసర్లు అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరిలో ఇద్దరికి అవకాశం రావొచ్చు. సీనియారిటీ ప్రకారం సిరాజ్, ప్రసిధ్ ఛాన్స్ ఉంటుంది.
ఆధిక్యం ఎవరిదంటే..?
ఇప్పటి వరకు భారత్ - జింబాబ్వే జట్లు ముఖాముఖిగా 63 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ అత్యధికంగా 51 విజయాలను నమోదు చేయగా.. జింబాబ్వే కూడా 10 మ్యాచుల్లో గెలవడం విశేషం. మరో రెండు మ్యాచుల్లో ఎలాంటి ఫలితం తేలలేదు. ఇరు జట్లూ ఎనిమిది ద్వైపాక్షిక సిరీసుల్లో ఢీకొట్టగా.. ఏడింటిని భారత్, ఒక సిరీస్ను జింబాబ్వే సొంతం చేసుకున్నాయి.
* అత్యధిక స్కోరు: గుహవాటి వేదికగా 2002లో జరిగిన మ్యాచ్లో భారత్ 333/6. దినేశ్ మోంగియా (159) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
* అత్యధిక వ్యక్తిగత స్కోరు: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. 1983 ప్రపంచకప్లో 175 పరుగులతో నాటౌట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 60 ఓవర్ల మ్యాచ్లో 138 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.
* అత్యల్ప స్కోరు : భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 65 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/27)
* అత్యధిక పరుగులు: జింబాబ్వేపై సచిన్ తెందూల్కర్ అత్యధికంగా పరుగులు సాధించాడు. 49.17 సగటుతో 34 మ్యాచుల్లో 1,377 పరుగులు చేశాడు.
* అత్యధిక వికెట్ల వీరుడు: అజిత్ అగార్కర్ జింబాబ్వేపై 26 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
* అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ ప్రదర్శన: జింబాబ్వేపై 2013లో జరిగిన వన్డేలో అమిత్ మిశ్రా (6/48) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs AUS: ముగింపు అదిరింది
ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట భారత్ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. -
Virat Kohli: సఫారీ గడ్డపై కోహ్లి అదరగొడతాడు : ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అదరగొడతాడని, అతని అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా మూడేసి చొప్పున టీ20లు, వన్డేలు, రెండు టెస్టులాడనుంది. -
David Warner: వార్నర్.. టెస్టుల్లో చివరిగా!
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో అతనికి చోటు దక్కింది. -
హైదరాబాద్ విజయం
విజయ్ హజారె వన్డే టోర్నీలో హైదరాబాద్ పుంజుకుంది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓడిన హైదరాబాద్.. విదర్భపై విజయం సాధించింది. ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన గ్రూప్-బి మ్యాచ్లో హైదరాబాద్ 30 పరుగులతో (వీజేడీ పద్ధతిలో) నెగ్గింది. -
జెయింట్స్ జోరు
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జోరు ప్రదర్శిస్తోంది. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో ఆ జట్టు సత్తాచాటింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో జెయింట్స్ 34-31 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. -
ప్రపంచ అథ్లెటిక్స్కు భారత్ బిడ్
2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ బిడ్ వేయనుంది. ఇంతకుముందు 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఇప్పుడు 2029 పోటీలపై దృష్టిసారించనుంది. ‘‘2029 ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. -
Rinku Singh: రింకు రేసులో ఉన్నాడు కానీ..
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ రేసులో రింకు సింగ్ ఉన్నాడు కానీ.. అందుకు అతడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ‘‘2024 టీ20 ప్రపంచకప్ జట్టు రేసులో కచ్చితంగా రింకు సింగ్ కూడా ఉంటాడు. -
జాతీయ ఛాంపియన్షిప్కు అర్జున్, హాసిని
జాతీయ అండర్- 13 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్లో తలపడే తెలంగాణ జట్టులో ఆదిరెడ్డి అర్జున్, హాసిని చోటు దక్కించుకున్నారు. సోమవారం నుంచి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఛాంపియన్షిప్ జరుగనుంది. -
యూరో ఛాంపియన్షిప్ డ్రా విడుదల
ఫుట్బాల్లో ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆదరణ ఉండే యూరోపియన్ ఛాంపియన్షిప్ డ్రా విడుదలైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీకి వచ్చే ఏడాది జర్మనీ ఆతిథ్యమివ్వనుంది. ఐరోపాలోని అత్యుత్తమ దేశాలు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. -
Team India: భారత్లో వాళ్లను క్షమించారు: రియాజ్
పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్కు సలహాదారుగా సల్మాన్ భట్ను నియమించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. ఫిక్సింగ్కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొన్న భట్కు హోదాను కల్పించినంద]ుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ
దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ సారథ్యం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
-
Congress: అప్పటికప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని..
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు
-
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం