Commonwealth Games 2022: భారత్కు మరో బంగారం.. వెయిట్ లిఫ్టింగ్లో అదరగొట్టిన జెరెమీ..
కామన్వెల్త్ క్రీడలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్లో నలుగురు......
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్లో నలుగురు క్రీడాకారులు పతకాలు సాధించగా.. 19 ఏళ్ల జెరెమీ లాల్ రిన్నుంగా అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. నిన్న స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించగా.. జెరెమీ 67 కేజీల విభాగంలో సత్తా చాటి రెండో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. స్నాచ్ ఈవెంట్లో 140 కేజీలు ఎత్తి కామన్వె్ల్త్ క్రీడల్లో రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్లో మొత్తంగా 160 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కిలోలకు పైగా ఎత్తి ఓవరాల్గానూ రికార్డు సృష్టించాడు. 165 కేజీలు ఎత్తే ఫైనల్ విభాగానికి ముందు గాయపడినప్పటికీ ఈ యువకెరటం వెనుకడుగు వేయలేదు. కోచ్ల సాయంతో పోటీని మొదటి స్థానంలో పూర్తిచేశాడు.
మిజోరం రాజధాని ఐజ్వాల్కు చెందిన జెరెమీ.. ఏడేళ్ల ప్రాయంలోనే వెయిట్లిఫ్టింగ్ వైపు అడుగులు వేశాడు. 2018 యూత్ ఒలింపిక్స్ 62 కేజీల విభాగంలో పసిడి సాధించాడు. గత కామన్వెల్త్ ఛాంపియన్షిప్లోనూ బంగారు పతకాన్ని సాధించాడు. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో జెరెమీ సాధించిన స్వర్ణంతో కలిపి భారత్ రెండు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది.
యువశక్తి చరిత్ర సృష్టిస్తోంది.. మోదీ
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. మన యువశక్తి చరిత్ర సృష్టిస్తోందని కొనియాడారు. ఆదివారం వెయిట్లిఫ్టింగ్లో అసాధారణ ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించిన 19 ఏళ్ల జెరెమీ లాల్ రిన్నుంగాకు మోదీ అభినందనలు తెలిపారు. చిన్న వయస్సులోనే దేశానికి గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు.
సంకేత్కు రూ.30లక్షల రివార్డు
మరోవైపు, వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నగదు రివార్డు ప్రకటించారు. సంకేత్కు రూ.30లక్షలు, ఆయన ట్రైనర్కు రూ.7లక్షల చొప్పున రివార్డుగా ఇవ్వనున్నట్టు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!