INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా
కామన్వెల్త్లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్లో టీమ్ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన..
సెమీస్లో ఇంగ్లాండ్పై అద్భుత విజయం
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్లో టీమ్ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, సోఫీ డంక్లే 19, కాప్సీ 13, సోఫీ 7, బౌచిర్ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. దీంతో రెండో సెమీస్లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
మంధాన దూకుడు
టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతీ మంధాన - షఫాలీ వర్మ తొలి వికెట్కు 76 పరుగులను జోడించారు. ఈ క్రమంలో మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్కు చేరడంతో భారత్ స్కోరు బోర్డు వేగం కాస్త ఆగింది. హర్మన్ (20), దీప్తి శర్మ (22) ఫర్వాలేదనిపించారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (44*) ఆఖరి వరకు ఉండి భారత్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెంప్ 2.. బ్రంట్, స్కివెర్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.