Pink Test: చరిత్రలో తొలిసారి ఆడనున్న మిథాలీసేన
మహిళల క్రికెట్ జట్టుకు శుభవార్త! చరిత్రలో తొలిసారి టీమ్ఇండియా మహిళల క్రికెట్ జట్టు గులాబి బంతి టెస్టు ఆడనుంది....
ముంబయి: మహిళల క్రికెట్ జట్టుకు శుభవార్త! చరిత్రలో తొలిసారి టీమ్ఇండియా మహిళల క్రికెట్ జట్టు గులాబి బంతి టెస్టు ఆడనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో తలపడనుంది. సెప్టెంబర్లో ఈ సిరీసు ఉండొచ్చని సమాచారం.
‘మహిళల క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం. చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు గులాబి టెస్టు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టులో తలపడనుంది. ఈ విషయం ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా గురువారం ట్వీట్ చేశారు.
మొత్తంగా మహిళల క్రికెట్లో ఇది రెండో డే/నైట్ టెస్టు కావడం విశేషం. 2017లో సిడ్నీలో ఆసీస్, ఇంగ్లాండ్ తొలి గులాబి టెస్టు ఆడాయి. టీమ్ఇండియా చివరి సారిగా 2006లో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇక మొత్తంగా ఆసీస్, భారత్ తొమ్మిది టెస్టులు ఆడగా కంగారూలు నాలుగు మ్యాచుల్లో గెలిచారు. ఐదు మ్యాచులు డ్రా అయ్యాయి.
ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. 2014 తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్టల్ వేదికగా జూన్ 16న ఇంగ్లాండ్తో తలపడనుంది. మిథాలీరాజ్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టుతో 3 వన్డేలు, 3 టీ20ల్లో భారత్ పోటీ పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా