INDW vs PAKW : కామన్వెల్త్ గేమ్స్.. పాక్పై టీమ్ఇండియా సూపర్ విక్టరీ
కామన్వెల్త్లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపు రుచి చూశారు. కీలకమైన పోరులో పాకిస్థాన్పై టీమ్ఇండియా...
సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న భారత్
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపు రుచి చూశారు. కీలకమైన పోరులో పాకిస్థాన్పై టీమ్ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత 99 పరుగులకే పాక్ను కట్టడి చేసిన భారత్.. లక్ష్య ఛేదనలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేసింది. కేవలం రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ స్మృతీ మంధాన (63*) హాఫ్ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించింది. షఫాలీ వర్మ 16, సబ్బినేని మేఘన 14, రోడ్రిగ్స్ 2* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో టుబా హస్సన్, సోహైల్ చెరో వికెట్ తీశారు.
బౌలింగ్లో అదరగొట్టి..
బౌలింగ్లోనూ పాక్ను టీమ్ఇండియా బెంబేలెత్తించింది. తొలి ఓవర్నే రేణుకా సింగ్ మెయిడిన్ వేయగా.. రెండో ఓవర్లో పాక్ బ్యాటర్ జావెద్ (0)ను మేఘ్నా సింగ్ పెవిలియన్కు చేర్చింది. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ మరూఫ్ (17)తో కలిసి ఓపెనర్ మునీబా అలీ (32) ఇన్నింగ్స్ను నిర్మించేందుకు ప్రయత్నించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 50 పరుగులను జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్నేహ్ రాణా ఒకే ఓవర్లో ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి పాక్ పతనం ప్రారంభమైంది. అయేషా నసీమ్ (10), అలియా రియాజ్ (18), సోహైల్ (10) రెండంకెల స్కోరు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరునైనా నమోదు చేసింది. ఆఖరి ఓవర్లో రనౌట్ సహా రెండు వికెట్లను తీసి పాక కుప్పకూలడంలో రాధా యాదవ్ కీలకపాత్ర పోషించింది. దీంతో సరిగ్గా 18 ఓవర్లకు 99 పరుగులకు పాక్ ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, రాధా యాదవ్ 2.. షఫాలీ వర్మ, రేణుకా సింగ్, మేఘ్నా సింగ్ తలో వికెట్ తీశారు.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా..
పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ప్రారంభించింది. తొలి ఓవర్ను ఆచితూచి ఆడిన ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ ఆ తర్వాతి నుంచి చెలరేగారు. కేవలం ఆరు ఓవర్లలోనే తొలి వికెట్కు 61 పరుగులు జోడించారు. దూకుడు పెంచేందుకు యత్నించిన షఫాలీని తుబా హస్సన్ పెవిలియన్కు చేర్చింది. ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన (14)తో మంధాన ఇన్నింగ్స్ను ముందుకు తీసుకుపోయింది. మరో ఆరు పరుగులు చేస్తే విజయం భారత్ సొంతమవుతుందనే క్రమంలో పాక్ బౌలర్ సొహైల్ బౌలింగ్లో మేఘన క్లీన్బౌల్డయింది. ఆఖర్లో స్మృతీ మంధాన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీతో భారత్ను విజయతీరాలకు చేర్చింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో టీమ్ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. బుధవారం బార్బోడస్తో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్కు చేరుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM