Asia Cup 2022: పసికూన హాంకాంగ్ను ఓడించి సూపర్-4కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్లో భాగంగా పసికూన హాంకాంగ్పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సూపర్-4కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
దుబాయి: ఆసియా కప్లో భాగంగా ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై గెలిచి జోరుమీదున్న భారత్.. పసికూన హాంకాంగ్పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సూపర్-4కు దూసుకెళ్లింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించగా, కోహ్లీ(59 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో బాబర్ హయత్(41) టాప్ స్కోరర్. భారత జట్టులో భువనేశ్వర్కుమార్, అర్ష్దీప్సింగ్, జడేశా, అవేశ్ఖాన్ తలో వికెట్ తీశారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు రెండో ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 12 పరుగుల వద్ద అర్ష్దీప్ బౌలింగ్లో యాసిమ్ ముర్తజా ఔటయ్యాడు. అనంతరం నిజఖత్ ఖాన్(10)తో జట్టు కట్టిన బాబర్ హయత్(41: 35 బంతుల్లో 3x4, 2x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రమంగా వేగం పెంచుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 6 ఓవర్ చివరి బంతికి నిజఖత్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఈ ఓవర్లో హాంకాంగ్ 17 పరుగులు రాబట్టింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 51 పరుగులతో మెరుగైన స్థితిలో ఉంది. అనంతరం వచ్చిన కించిత్ షా(30: 28 బంతుల్లో)తో కలిసి బాబార్ హయత్ ఇన్నింగ్స్ను నిర్మించే క్రమంలో 74 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో హయత్ ఔట్ కావడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే సాధించాల్సిన రన్రేట్ బాగా పెరిగిపోయింది. దీంతో హాంకాంగ్ ఏ దశలోనూ కోలుకోలేకుండా పోయింది. బాబర్ అనంతరం క్రీజులోకి వచ్చిన అజిజ్ ఖాన్(14) జట్టు స్కోర్ 105 పరుగుల వద్ద అవేశ్ఖాన్కు చిక్కాడు. దీంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 116 పరుగుల వద్ద ఐదో వికెట్ రూపంలో కించిత్ ఖాన్ కూడా ఔట్కావడంతో ఆ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. చివర్లో జీషన్ అలీ(26 నాటౌట్), స్కాట్(16) మరో వికెట్ పడకుండా ఉండి ఓటమి పరుగుల అంతరాన్ని తగ్గించారు.
సూర్యకుమార్ మెరుపులు..
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విఫలమైన రాహుల్, రోహిత్లు తొలుత ఆవేశపడకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో తొలిఓవర్లో ఐదు పరుగులు, రెండో ఓవర్లో కేవలం ఒకే పరుగు వచ్చింది. అయితే మూడో ఓవర్లో వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రెండు సిక్స్లు, ఓ ఫోర్తో విరుచుకుపడ్డారు. దీంతో ఈ ఒక్కఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 4.5 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ(21: 13 బంతుల్లో) ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 38 పరుగులు. అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లీ(59 నాటౌట్: 44 బంతుల్లో 1x4, 3x6) రాహుల్(36: 39 బంతుల్లో 2x6)తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ క్రమంలో భారత్ పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 70 పరుగులతో నిలిచింది. ఇక వేగంగా ఆడే క్రమంలో 13 ఓవర్ చివరి బంతికి రాహుల్ ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 94 పరుగులు. రాహుల్ వెనుదిరగడంతో క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. వచ్చిరావడంతో సూర్యకుమార్ ప్రత్యర్థి బౌలర్లపై వీరవిహారం చేశాడు. బౌండరీలతో వారిని బెంబేలెత్తించాడు. కోహ్లీ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ సూర్యకుమార్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. సూర్యకుమార్ 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరి బాదుడుకు భారత్ చివరి 5 ఓవర్లలో 78 పరుగులు రాబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’