IND vs AUS: ఆసీస్పై ఆల్రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆసీస్పై 99 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
ఇందౌర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆసీస్పై 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్లో 9 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కంగారుల జట్టు.. 150లోపే చాపచుట్టేసేలా కనిపించింది. కానీ, బౌలింగ్ ఆల్రౌండర్ సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) అనుహ్యంగా చెలరేగాడు. టాపార్డర్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా.. లబుషేన్ (27) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, షమి ఒకటి చొప్పున వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ గైక్వాడ్ (8) మినహా మిగతా బ్యాటర్లందరూ రాణించడంతో వన్డేల్లో ఆసీస్పై భారత్ అత్యధిక స్కోరును సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) శతకాలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లో అర్ధ శతకాలు సాధించారు. ఇషాన్ కిషన్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడాడు. రెండో వికెట్కు గిల్, శ్రేయస్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్వుడ్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Nagarjuna sagar: నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ
-
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం