U-19 world cup: అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ బోణీ
అండర్ - 19 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో యువభారత్ తన సత్తా చాటింది. భారత్ దక్షిణాఫ్రికాకు నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా విజయం
భారత్ 233.. దక్షిణాఫ్రికా 188
గయానా: అండర్ - 19 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో యువభారత్ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే భారత్ షాకిచ్చింది. తొలి ఓవర్ నాలుగో బంతికే జాన్ కన్నింగ్హమ్ (0)ను రాజ్వర్థన్ హంగర్గెకర్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు విక్కీ (5/28), బవా (4/47) వరుసగా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికా జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. రాజ్వర్థన్ హంగర్గెకర్ ఒక వికెట్ తీశాడు. ఐదు వికెట్లు తీసిన విక్కీ ఓస్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్..
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయిన భారత్ను సారథి, ఉపసారథి ఆదుకున్నారు. కెప్టెన్ యాష్ ధుల్ (82), రషీద్ (31) ఇన్నింగ్స్ను నిలబెట్టారు. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఓపెనర్లు రఘువన్షి (5), హర్నూర్ సింగ్ (1) ఔటయ్యారు. ఆ తర్వాత యాష్-రషీద్ కలిసి మూడో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరితో పాటు నిశాంత్ సింధు (27), రాజ్ బవా (13), కౌశల్ తంబే (35) రాణించడంతో.. జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. చివర్లో కెప్టెన్ యశ్ రనౌట్ కావడం.. మిగతా బ్యాటర్లు త్వరగా పెవిలియన్కు చేరడంతో 46.5 ఓవర్లలో 232 పరుగులకే భారత్ పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు మాథ్యూ బోస్ట్ 3 వికెట్లు తీయగా.. అఫీవ్ నియాండా, డేవిడ్ బ్రవీస్ చెరో రెండు వికెట్లు తీశారు. లియామ్ ఎల్డర్, మిక్కీ కోప్లాండ్ చెరో వికెట్ దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ