IND vs SL: భారత్పై శ్రీలంక విజయం..
టీమ్ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది...
2-1 తేడాతో గబ్బర్సేన సిరీస్ కైవసం..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ను శ్రీలంక 1-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు భారత్ తొలి రెండు వన్డేలు గెలుపొందడంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి ఉత్కంఠ పరిస్థితుల్లో విజయం సాధించింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(76; 98 బంతుల్లో 4x4, 1x6), వన్డౌన్ బ్యాట్స్మన్ భానుక రాజపక్స(65; 56 బంతుల్లో 12x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 109 పరుగులు జోడించి లంక విజయానికి బలమైన పునాది వేశారు. తర్వాత చారిత్ అసలంక (24; 28 బంతుల్లో 3x4), రమేశ్ మెండిస్(15 నాటౌట్; 18 బంతుల్లో 1x4) వీలైనన్ని పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో తమవంతు పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు, చేతన్ సకారియా రెండు వికెట్లు తీయగా హార్దిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 225 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శిఖర్ ధావన్(13) త్వరగా పెవిలియన్ చేరినా పృథ్వీషా(49; 49 బంతుల్లో 8x4), వన్డౌన్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (46; 46 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలకు ముందు స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. అప్పటికి భారత్ స్కోర్ 118/3గా నమోదైంది. తర్వాత సూర్యకుమార్(40; 37 బంతుల్లో 7x4), మనీశ్ పాండే (11; 19 బంతుల్లో) ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. 23 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. దాంతో సుమారు 45 నిమిషాలు పాటు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ను డక్వర్త్లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లకు కుదించారు.
మరోవైపు మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక లంక బౌలర్లు చెలరేగిపోయారు. భారత బ్యాట్స్మెన్ను కుదురుకోనివ్వలేదు. వరుస క్రమంలో వికెట్లు తీశారు. 38 పరుగుల తేడాతో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశారు. దాంతో టీమ్ఇండియా 32.5 ఓవర్లకే 195/8 స్కోర్తో నిలిచింది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య (19), సూర్యకుమార్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ (2), నితీశ్ రాణా (7) వరుసగా ఔటయ్యారు. అయితే, 34వ ఓవర్ నుంచి బ్యాటింగ్ కొనసాగించిన రాహుల్ చాహర్ (13), నవ్దీప్ సైని (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 29 పరుగులు జోడించి భారత్కు మోస్తరు స్కోర్ అందించారు. చివరికి 42, 43 ఓవర్లలో ఒకరి తర్వాత ఒకరు ఔటవ్వడంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్కు తెరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. -
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్