ZIM vs IND : జింబాబ్వేతో మూడో వన్డే.. చెమటోడ్చి నెగ్గిన టీమ్ఇండియా
జింబాబ్వేను భారత్ క్లీన్స్వీప్ చేసేసింది. మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన...
భారత్కు చెమటలు పట్టించిన సికిందర్
మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన రాహుల్ సేన
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేను భారత్ క్లీన్స్వీప్ చేసేసింది. మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 276 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో జింబాబ్వే విజయం సాధించేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు ఆఖర్లో జింబాబ్వే బ్యాటర్లను అడ్డుకోగలిగారు. సికిందర్ రజా (115) శతకం సాధించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. బ్రాడ్ ఇవాన్స్ (28)తో కలిసి 104 పరుగులను జోడించాడు. అయితే టీమ్ఇండియా బౌలర్లు స్వల్ప వ్యవధిలో వారిద్దరిని ఔట్ చేయడంతో కథ సుఖాంతమైంది. మిగతా బ్యాటర్లలో సీన్ విలియమ్స్ (45) రాణించగా.. కైతానో 13, కైయా 6, టోనీ 15, రెగిస్ చకబ్వా 16, రైన్ బర్ల్ 8, లూక్ జాగ్వే 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, దీపక్ చాహర్ 2, కుల్దీప్ 2, అక్షర్ పటేల్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
గిల్ సూపర్ సెంచరీ
శుభ్మన్ గిల్ (130) అద్భుతమైన శతకం సాధించాడు. ఆరంభం నుంచి సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. గిల్తోపాటు ఇషాన్ కిషన్ (50) రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. భారత బ్యాటర్లలో శిఖర్ ధావన్ 40, కేఎల్ రాహుల్ 30, దీపక్ హుడా 1, సంజూ శాంసన్ 15, అక్షర్ పటేల్ 1, శార్దూల్ ఠాకూర్ 9 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5.. నైయుచి, లూక్ జాగ్వే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో సెంచరీతోపాటు, సిరీస్లో రాణించిన శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?