GILL : టీ20 లీగ్‌లో రాణిస్తే.. ప్రపంచకప్‌ జట్టులోకి తలుపులు తెరుచుకుంటాయ్‌: గిల్

ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే పొట్టి ప్రపంచకప్‌ జట్టులో.. 

Updated : 26 Mar 2022 16:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : మెగా టీ20 టోర్నీలో రాణించడం ద్వారా ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే ప్రపంచకప్‌కు వెళ్లే టీమ్‌ఇండియా జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉందని యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్‌ తెలిపాడు. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే సీజన్‌లో శుభ్‌మన్ గిల్ గుజరాత్ తరఫున ఆడనున్న విషయం తెలిసిందే. ‘‘ఎవరైతే ఈ టోర్నీలో బాగా రాణిస్తారో వారికి వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉంటాయి. నేను కూడా బాగా ఆడి జట్టులో చోటు సంపాదించాలని ఎదురు చూస్తున్నా’’ అని గిల్ పేర్కొన్నాడు. 

ఈసారి ఎవరు టైటిల్‌ను నెగ్గుతారనే దానిపై గిల్ స్పందిస్తూ.. ‘‘టైటిల్‌ను నెగ్గే అవకాశం పది జట్లకూ ఉంది. అయితే సునామీలా దూసుకొచ్చి ఈసారి గుజరాత్‌ సొంతం చేసుకుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మా జట్టులో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లూ అందరూ ఉన్నారు. మైదానంలో ప్రణాళికలను అమలు చేస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే జట్టు సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాం. హార్దిక్‌ పాండ్య తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి నచ్చినట్లు ఆడమని చెప్పాడు. మైదానంలోనూ ఇదే స్వేచ్ఛ ఉంటే కెప్టెన్‌ నుంచి మేం ఇంకేమీ ఆశించం’’ అని వివరించాడు. గుజరాత్‌కు పటిష్ఠమైన కోచింగ్‌ స్టాఫ్‌ ఉందని శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని